పీఆర్వో, నిర్మాత అకస్మాత్తుగా మరణించడంతో టాలీవుడ్లో అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇప్పుడిప్పుడే నిర్మాతగా మంచి ఫాంలోకి వస్తోన్న ఇలా గుండెపోటుతో మరణించడంతో సన్నిహతులు షాక్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్కు మహేష్ కోనేరు క్లోజ్ ఫ్రెండ్. తన స్నేహితుడి అకాల మరణంతో ఎమోషనల్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా మహేష్ కోనేరుకు మంచి పేరు వచ్చింది. అయితే నిర్మాత మరణం వెనక వేరే కథ ఉందని తెలుస్తోంది. నా నువ్వే, 118, మిస్ ఇండియా, తిమ్మరుసు వంటి సినిమాలను మహేష్ కోనేరు నిర్మించారు. ఇక విజిల్, మాస్టర్ వంటి చిత్రాలను తెలుగు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంకా లైనప్ యంగ్ హీరోలతో సినిమాలున్నాయి. కానీ ఇలాంటి తరుణంలో మహేష్ మరణించారు. గుండెపోటు రావడం వెనుక కొన్ని కారణాలున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మహేష్ తీసిన చిత్రాల్లో ఏది కూడా అంతగా ప్రాఫిట్ తెచ్చినవి లేవు. ఆయనకు ఇండస్ట్రీలో దాదాపు 80 కోట్ల మేర అప్పు ఉందని సమాచారం. అప్పుల బాధతోనే మహేష్ ఒత్తిడికి లోనై ఉంటారని, అందుకే గుండెపోటు వచ్చి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అయితే మహేష్ కోనేరు అంత మొత్తంలో అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందా? అని అందరూ అనుకుంటున్నారు. ఇండస్ట్రీలోనే చాలా మంది దగ్గర ఆయన అప్పు తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి వీటిలో ఎంత నిజముందో ఆయన కుటుంబ సభ్యులకే తెలియాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YU9FjZ
No comments:
Post a Comment