కొడుకు విషయమై నాగార్జున చొరవ.. అదే టార్గెట్‌గా రంగంలోకి! ఇంతకీ వర్కవుటయ్యేనా..?

ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలు చర్చల్లో నిలుస్తున్నాయి. అక్కినేని నాగ చైతన్య- సమంత డివోర్స్ తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. మరోవైపు కొడుకులు నాగ చైతన్య, అఖిల్ కెరీర్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్‌ని ఈ సారి ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కించాలని పట్టుదలగా ఉన్నారట నాగ్. ఈ మేరకు ఆయన లేటెస్ట్ మూవీ '' సినిమా విషయమై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారట. కెరీర్‌లో టర్న్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ మూవీ ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో నాగార్జున చొరవ తీసుకున్నారని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తుండగా ఆయనే స్వయంగా రంగంలోకి దిగి కొన్ని కీలకమైన సీన్స్ ఎడిట్ చేయించారట. పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ దర్శకనిర్మాతలకు పలు సూచనలిచ్చారట. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీతో అఖిల్ ఎలాగైనా స్టార్ ఇమేజ్ కొట్టేయాలనే ఉద్దేశంతో నాగార్జున పట్టుదలగా ఉన్నారని, అందుకే చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాల విషయంలో ఆయన చొరవ తీసుకున్నారని తెలుస్తోంది. యూత్ ఆడియన్స్ టార్గెట్‌గా ఫీల్ గుడ్ కథాంశంతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3B0BvsR

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts