బాహుబలితో వరల్డ్వైడ్గా తనకంటూ ఓ క్రేజ్ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి తదుపరి చిత్రాన్ని సూపర్స్టార్ మహేశ్తో చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించేశాడు. అందుకు సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే లేటెస్ట్గా మహేశ్ సినిమా కంటే ముందు ఓ సినిమాను జక్కన్న చేయాలనుకుంటున్నట్లు టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్తో దీనికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయట. పరశురాం సినిమా తర్వాత మహేశ్ త్రివిక్రమ్తో సినిమా చేయాల్సి ఉంది. అది పూర్తయ్యాక రాజమౌళి సినిమా చేస్తాడు. ఇది పూర్తి కావడానికి తక్కువలో తక్కువ ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది. ఇందులో మహేశ్ జక్కన్న సినిమా లుక్ కోసం రెండు నెలలు కేటాయించాల్సి ఉంటుంది. అంటే ఆరు నెలలు గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఈ ఆరు నెలల గ్యాప్లో రాజమౌళి అండ్ టీమ్ ఓ బాలీవుడ్ సినిమాను చేయబోతున్నారట. రాజమౌళి అంటే సినిమాను స్లోగా తెరకెక్కిస్తాడని, అనుకున్న ఔట్పుట్ వచ్చే వరకు కాంప్రమైజ్ కాడని, అందుకనే ఆయన సినిమాలు ఆలస్యమవుతాయని టాక్ ఉంది. అయితే అందుకు భిన్నంగా ఇది వరకు ఎన్నడూ చేయనంత ఫాస్ట్గా బాలీవుడ్ మూవీ చేయాలనుకుంటున్నాడట. నెల నుంచి నెలన్నర లోపు సినిమా షూటింగ్ను పూర్తి చేయడం, రెండు నుంచి మూడు నెలలు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడం మరో నెల ప్రమోషన్స్ గట్రా.. ప్లాన్ చేసుకుని సినిమాను విడుదల చేయాలనేదే ప్లాన్ అని అంటున్నారు. అయితే ఒకవైపు కరోనా, మరో వైపు జక్కన్న.. ఇంత తక్కువ సమయంలో మన దర్శక ధీరుడు సినిమాను పూర్తి చేస్తాడా? అనేది కొందరి డౌట్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kmquwe
No comments:
Post a Comment