రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR మూవీ పూర్తిచేసే పనిలో ఉన్న ఎన్టీఆర్.. ఇది పూర్తయిన వెంటనే సినిమాను లైన్లో ఉంచారు. 30గా ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. మరోవైపు 'ఆచార్య' సినిమా పనులతో బిజీగా ఉన్న కొరటాల శివ.. ఆ సినిమా పనులను త్వరగానే పూర్తి చేసుకొని.. ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందే ఈ సినిమాకు సంబంధించి ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.. కొరటాల. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్గా కనిపిస్తుండగా.. మన టాలీవుడ్ అగ్రహీరోలు కూడా ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారట. బాలీవుడ్, ఇతర భాషల్లోని ఫేమస్ యాక్టర్స్ ఈ సినిమాలో భాగమవుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం కొరటాల మరో మాస్టర్ ప్లాన్ను వేశారట. సినిమాలో ఎన్టీఆర్ను కొత్త లుక్లో చూపించాలని భావిస్తున్న ఆయన.. ప్రముఖ డీఓపీ రత్నవేలును ఈ సినిమా టీమ్లో చేర్చుకున్నారు అని సమాచారం. ఇప్పటికే రత్నవేలుతో కొరటాల సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకూ టాలీవుడ్లో వాడని అత్యాధునిక టెక్నాలజీని ఈ సినిమాలో ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. అందుకోసం విదేశాల నుంచి ప్రత్యేకమైన కెమెరాలు ఇతర పరికరాలు తెప్పిస్తున్నారట. ఈ వార్త ప్రస్తుతం వైరల్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోయాయి. నందమూరి కళ్యాణ్రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందించబోతున్నారు. ఏప్రిల్ 29వ తేదీ 2022న రిలీజ్ చేస్తామని కూడా ముందే ప్రకటించేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్గా అలియా భట్ నటిస్తోందని టాక్ వినిపిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Ci0IiQ
No comments:
Post a Comment