సూపర్ స్టార్ మహేష్ బాబుకు విదేశాలు చుట్టి రావడం కొత్తేమీ కాదు. ఫ్యామిలీతో పాటు లాంగ్ టూర్స్ వేయడం, అలాగే తన సినిమా షూటింగ్ కోసం ఎల్లలు దాటడం ఆయనకు కామన్. ఈ క్రమంలోనే మరోసారి ఫ్లయిట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారట మహేష్. ఈ సారి ఏకంగా నెల రోజులపాటు విదేశంలోనే గడపనున్నారని తెలుస్తోంది. మహేష్ లేటెస్ట్ మూవీ ‘’ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన స్పెయిన్ దేశం వెళ్లనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. ఈ నెలాఖరున స్పెయిన్లో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారట మేకర్స్. ఇందులో భాగంగా చిత్రంలోని రెండు పాటల షూటింగ్తో పాటు కొంత భాగం టాకీ పార్ట్ షూట్ చేయనున్నారని సమాచారం. ఓ నెల రోజుల పాటు టీమ్ మొత్తం అక్కడే ఉండనుందట. ఆ వెంటనే డిసెంబర్లో మరో షెడ్యూల్ పూర్తి చేసి షూటింగ్ అంతా కంప్లీట్ చేయనున్నారని అంటున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zjOkNl
No comments:
Post a Comment