ఒకప్పుడు అంటే కుర్రకారు పడిచచ్చిపోయే వారు. ఆమె నవ్వులు, స్టెప్పులకు అప్పటి యూత్ ఫిదా అయిపోయారు. చిరంజీవి, బాలకృష్ణ ఇలా ఎవ్వరి పక్కనైనా నటించి, వారికి పోటీగా డ్యాన్సులు వేయగల అతికొద్ది మంది హీరోయిన్లలో రోజా ఒకరు. రోజా తన గ్రేసుతో వేసే స్టెప్పులకు ఇప్పటికీ అభిమానులున్నారు. అలా చిరంజీవితో సరిసమానంగా స్టెప్పులు వేయగలిగిన రోజాకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అలా కొన్నేళ్లు టాప్ ప్లేస్లో ఉన్న రోజా.. చివరకు రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇప్పుడు రోజా క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై సందడి చేస్తూనే.. రాజకీయాల్లోనూ దూసుకుపోతోన్నారు. ఆమె మైక్ పడితే అవతలి వాళ్లు బెదిరిపోవాల్సిందే. ఫైర్ బ్రాండ్ రోజా మాటలు నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె తన కన్నీటి వ్యథను అందరితోనూ పంచుకున్నారు. వినాయక చవితి సందర్భంగా అనే ప్రోగ్రాం రాబోతోంది. ఇందులో రోజా తన గతాన్ని చెప్పుకొచ్చారు. నేను 1991లో ఇండస్ట్రీకి వచ్చాను.. 2002 వరకు కష్టపడిన మొత్తం కూడా అప్పులే కట్టాను. పెళ్లి చేసుకునే ముందు నాకు సమస్యలు వచ్చాయి.. పిల్లలు పుట్టరు అని చెప్పారు. కానీ పెళ్లైన ఏడాదికి అన్షు పుట్టింది. అందుకే నాకు అన్షు అంటే చాలా ఇష్టం అంటూ రోజా కన్నీరుపెట్టేసుకున్నారు. మొత్తానికి ఎప్పుడూ నవ్వులు చిందించే రోజా వెనుక ఇన్ని కష్టాలున్నాయా? అని అందరూ అనుకుంటున్నారు. అయినా అన్ని అప్పులు ఎలా ఎందుకు చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gZTFTw
No comments:
Post a Comment