ట్రెండ్ మారింది.. వెండితెరపై మెరుపులు మెరిపించి కాసుల వర్షం కురిపిస్తున్న సినీ తారలు ఇప్పుడు బుల్లితెరపై కూడా అదే రేంజ్ హవా నడిపిస్తున్నారు. వీలు కుదిరితే చాలు ప్రతి ఇంట చిన్నితెరపై సందడి చేస్తూ అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న షో '' కోసం సూపర్ స్టార్ రంగంలోకి దిగడం హాట్ టాపిక్ అయింది. ఓ వైపు బిగ్ బాస్.. మరోవైపు 'ఎవరు మీలో కోటీశ్వరులు'. ప్రస్తుతం ఈ రెండు షోస్ ట్రెండ్ నడుస్తోంది. భారీ టీఆర్ఫీ రాబడుతూ బుల్లితెర ఆడియన్స్కి వేటికవే ప్రత్యేకంగా వినోదం పంచుతున్నాయి. కాగా ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' కోసం స్పెషల్ గెస్టులను తీసుకొచ్చి ప్రేక్షకులను మరింత అట్రాక్ట్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల్లో ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కోసం మహేష్ బాబు ఎంటర్ అయ్యారు. గత రెండు రోజుల క్రితం ఈ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ కంప్లీట్ అయిందని, ఇందులో మహేష్ భారీ సొమ్ము గెలుచుకున్నారని తెలుస్తోంది. తాజాగా బయటకొచ్చిన సమాచారం మేరకు ఈ ఎపిసోడ్ హోరాహోరీగా నడిచిందని తెలుస్తోంది. మహేష్ బాబు- ఎన్టీఆర్ మధ్య జరిగిన సంభాషణ ఇరువురు హీరోల ఫ్యాన్స్కి కిక్కిస్తుందని అంటున్నారు. ఇక ఈ ఆటలో మహేష్ బాబు మొత్తం పాతిక లక్షల రూపాయలు గెలుచుకున్నారని, ఆ మొత్తాన్ని ఛారిటీకి దానం చేశారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మహేష్ ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. అయితే ఈ ఆసక్తికర ఎపిసోడ్ని దసరా కానుకగా టెలికాస్ట్ చేసే అవకాశాలున్నాయనేది లేటెస్ట్ సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lFF0hW
No comments:
Post a Comment