తెలుగు ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. అలా డిఫరెంట్ స్టైల్లో సినిమాలు చేయడంలో దర్శకుడు ఎప్పుడూ ముందుంటారు. ఆయన సినిమాల్లో ఓ విలక్షణత ఉంటుంది. ‘అతనొక్కడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఆయన ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రవితేజ, రామ్ చరణ్, చిరంజీవి వంటి హీరోలతో ఆయన సినిమాలు చేసి సూపర్హిట్లు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన అఖిల్ అక్కినేని హీరోగా ‘’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో ఈ 'ఏజెంట్' మూవీ రూపొందనుంది. మునుపెన్నడూ చూడని విభిన్నమైన కథ, యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. సినిమాలో అఖిల్ని ఓ సీక్రెట్ ఏజెంట్గా సరికొత్త పాత్రలో చూపించబోతున్నారని తెలుస్తోంది. సాక్షి వైద్య ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం కానుంది. ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి పవర్స్టార్ పవన్కళ్యాణ్తో ఓ సినిమా చేస్తున్నారు. అయితే పవన్ వరుస ప్రాజెక్టుతో బిజీగా ఉండటంతో.. సురేందర్ రెడ్డితో సినిమా ఇప్పట్లో పట్టాలు ఎక్కేలా అనిపించడం లేదు. దీంతో ఈ గ్యాప్లో మరో రెండు సినిమాలు చేయాలని సురేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. అందులో ఒకటి యూత్ స్టార్ నితిన్తో కలిసి ఆయన ఓ సినిమా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ‘మాస్ట్రో’ సినిమా ప్రమోషన్స్లో ఉన్నారు. ఆయన ఈ సినిమాలో అంధుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నభా నటేష్, తమన్నాలు హీరోయిన్లుగా చేస్తున్నారు. దీంతో పాటు నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన సురేందర్ రెడ్డితో కలిసి సినిమా ప్రారంభించనున్నారని.. ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై స్పష్టత రావాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఎదురుచూడాల్సిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kYFlM6
No comments:
Post a Comment