జబర్దస్త్ యాంకర్, సినీ నటి భరద్వాజ్ మూడో ప్రెగ్నెన్సీ విషయమై గతంలోనే తన మనసులోకి మాటలను బయటపెట్టి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె.. మూడోసారి గర్భం దాల్చడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని, మళ్లీ తల్లి కావాలనుందని చెప్పిన మాటలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇద్దరు పిల్లలుంటే చాలని భావిస్తున్న ఈ రోజుల్లో తనకు మూడో సంతానం కనాలని ఉందని అనసూయ చెప్పడం వెనుక రీజన్ ఏమై ఉంటుందని ఆరా దీస్తూనే ఉన్నారు జనం. ఇంతలో తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో తన మూడో ప్రెగ్నెన్సీపై ఆమె క్లియర్ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ.. ''నాకు ఇప్పుడు 35 ఏళ్లు. 40 సంవత్సరాలు వచ్చాక మరోసారి తల్లి కావాలని అనుకుంటున్నా. ఈ సారి నాకు పాపే కావాలి. తన కోసం నా సమయాన్నంతా కేటాయిస్తాను'' అని చెప్పింది. హాట్ యాంకర్, పైగా నిత్యం జనం నోళ్ళలో నానే అనసూయ ఆ మాట చెప్పడంతో ఆమె మూడో ప్రెగ్నెన్సీపై లెక్కలేనన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ పరిస్థితుల నడుమ జబర్ధస్త్ షోలో అనసూయ గర్భం దాల్చడంపై చేసిన కామెంట్స్, దానిపై అనసూయ ఇచ్చిన జబర్దస్త్ రియాక్షన్ వైరల్ అవుతోంది. వచ్చే వారం ప్రసారం కాబోతున్న జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా ఇందులో అనసూయ ప్రెగ్నెన్సీపై అదిరే అభి వేసిన స్కిట్ హైలైట్ అయింది. 'టైమ్కు అన్నం తిను అనసూయ.. పులుపు తినాలనిపిస్తే నేను మామిడి పళ్లు.. అవీ పంపిస్తా' అని అనసూయ సీటు దగ్గరికి వెళ్లి మరీ చెప్పాడు అభి. దీంతో 'దానికి ఇంకా చాలా టైముందిలే' అని అనసూయ ఆన్సర్ చేయడంతో అక్కడే ఉన్న రోజా, సింగర్ మనో సహా అంతా షాకయ్యారు. ఆ తర్వాత 'ఇది సెప్టెంబర్ నెల.. అంటే అందరికీ తొమ్మిదో నెలే కదా' అంటూ లాజిక్ ప్లే చేసింది అనసూయ. అయితే ఈ సీన్ చూసిన జనం మాత్రం అనసూయ తన మూడో ప్రెగ్నెన్సీపై క్లియర్ హింట్ ఇచ్చిందని, మూడోసారి గర్భం దాల్చడానికి కొంత సమయం ఉందని చెప్పిందని భావిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మరోసారి జబర్దస్త్ బ్యూటీ ప్రెగ్నెన్సీ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BCYgmG
No comments:
Post a Comment