తెలుగులో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన తాప్సీకి ప్రారంభంలో ఇక్కడ అన్నీ పరాజయాలే పలకరించాయి. ఆ తరుణంలో ఆమెకు బాలీవుడ్ నుంచి బేబి సినిమా ఆఫర్ రావడంతో ఆమె దశ తిరిగిపోయింది. ఆ సినిమా హిట్ నుంచి బాలీవుడ్లో బిజీగా మారిపోయింది తాప్సీ. ఇప్పుడు తెలుగు సినిమాల కంటే బాలీవుడ్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుందీ అమ్మడు. ప్రస్తుతం పన్ను చేస్తున్న చిత్రం ‘రష్మీ రాకెట్’. ఇందులో ఆమె గుజరాత్కు చెందిన రష్మీ అనే స్పింటర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా కోసం తాప్సీ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ముఖ్యంగా స్పింటర్ లుక్ కోసం. రీసెంట్గా ఈ సినిమాలో తన లుక్ను వెనుక నుంచి ఫొటో తీసి తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఇదెవరో గుర్తు పట్టండి అని క్యాప్షన్ కూడా పెట్టింది. చాలా మంది తాప్సీ లుక్ చాలా బావుందని, ఈ లుక్ కోసం ఆమె చాలా కష్టపడ్డట్లు తెలుస్తుందని రిప్లై ఇచ్చారు. అయితే ఓ నెటిజన్ మాత్రం ‘ఇలాంటి మగవాడి శరీరం లుక్ తాప్సీకి మాత్రమే ఉంటుంది’ అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే దీనికి తాప్సీ అంతే గట్టిగా బదులిచ్చింది. ‘ఈ లైన్ను గుర్తు పెట్టుకో. సెప్టెంబర్ 23 వరకు వెయిట్ చెయ్. ఈ కాంప్లిమెంట్ కోసం చాలా కష్టపడ్డాను. అడ్వాన్స్గా థాంక్యూ’ అని రిటార్ట్ ఇచ్చింది తాప్సీ. పొగడ్తల కంటే విమర్శలు ఎదురైనప్పుడు తాప్సీ రియాక్షన్ చాలా బలంగా ఉంటుందని నెటిజన్స్ తాప్సీని ప్రశంసిస్తున్నారు. ఆమెకు లక్ష్మీ మంచు సహా అభిమానులు అండగా నిలిచారు. తాప్సీ సమాధానం చూస్తుంటే సెప్టెంబర్ 23న రష్మీ రాకెట్కు సంబంధించి బలమైన అప్డేట్ ఉండేలా అనిపిస్తుంది. సినిమా అక్టోబర్ 15న ఓటీటీలో డైరెక్ట్గా విడుదలవుతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Cw8xkZ
No comments:
Post a Comment