వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈసారి ఏకంగా కోర్టు పనితీరునే తప్పు పట్టింది. కోర్టు తనను బెదిరిస్తుందని, కోర్టుపై నమ్మకం పోయిందని సంచలన వ్యాఖ్యలు చేసిందీ అమ్మడు. అసలేం జరిగింది అనే వివరాల్లోకెళ్తే.. బాలీవుడు హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు నెపోటిజంపై విమర్శలు చేసిన కంగనా, హృతిక్ రోషన్, రైటర్ జావెద్ అక్తర్లను ఉద్దేశిస్తూ ‘బాలీవుడ్లో కోటరీ వ్యవస్థ చాలా బలంగా నాటుకుపోయింది’ అంటూ పరోక్షంగా విమర్శలు చేసింది. దీనిపై రైటర్ జావెద్ అక్తర్ కంగనా రనౌత్పై పరువు నష్టం దావా వేశారు. కేసును పరిశీలిస్తున్న ముంబై అంథేరి మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కంగనా రనౌత్ను కోర్టు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేస్తూ వచ్చారు. చివరకు కంగనా కోర్టుకు హాజరయ్యింది. బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా, ఇవ్వకుండా కోర్టు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని పరోక్షంగా కోర్టు రెండు సార్లు తనను బెదిరించిందని తెలిపారు కంగనా. కేసు దర్యాప్తు తనకు వ్యతిరేకంగా సాగుతుందని, అందువల్ల మరో కోర్టుకు కేసుని బదలాయించాలని చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ముందు కంగనా అండ్ టీమ్ రిక్వెస్ట్ చేశారు. ఈ దరఖాస్తును అక్టోబర్ 1న కోర్టు పరిశీలించనుంది. సినిమాల విషయానికి వస్తే, రీసెంట్గా కంగనా నటించిన తలైవి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ను తెచ్చుకుంది. ధాఖడ్, తేజస్ సినిమాల్లో ఇప్పుడీమె నటిస్తుంది. ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న కంగనా, రీసెంట్గా టాలీవుడ్లో అవకాశం వస్తే పూరీ జగన్నాథ్, ప్రభాస్లతో నటించాలనుకుంటున్నట్లు కూడా తెలియజేయడం విశేషం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nPcHQH
No comments:
Post a Comment