తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ అధ్యాయం. చిన్న నటుడిగా కెరీర్ను స్టార్ట్ చేసిన ఆయన తనదైన కష్టంతో ఇమేజ్, క్రేజ్ను సంపాదించుకుని నెంబర్ వన్ స్టార్గా ఎదిగారు. ఈ ఎదిగే క్రమంలో ఆయన చాలా స్ట్రగుల్స్ను ఫేస్ చేశారు. అయితే ప్రతి సమస్యను దాటుకుని ముందడుగు వేశారు. చిరంజీవి నటించిన చిత్రాల్లో ముందుగా విడుదలైంది ప్రాణం ఖరీదు. అయితే ముందుగా ఆయన కెమెరా ముందు నటించిన చిత్రం మాత్రం . ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ గమ్మత్తైన విషయం జరిగింది. అదేంటంటే.. పునాదిరాళ్లు సినిమా షూటింగ్ను రాజమండ్రిలోని ఉమెన్స్ కాలేజీలో చిత్రీకరిస్తున్నారు. సన్నివేశానికి సంబంధించి విరామం దొరికినప్పుడు నరసింహరాజు, రోజా రమణి, కవిత, చిరంజీవి కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఓ అమ్మాయి వచ్చి అందరి దగ్గర ఆటోగ్రాఫ్స్ తీసుకుంది. కానీ చిరంజీవి దగ్గర తీసుకోలేదు. తొలి చిత్రం కావడం వల్ల తనెవరో తెలిసుండకపోవచ్చునని చిరంజీవి భావించినప్పటికీ, మనసులో కాస్త అవమానంగా ఫీలయ్యారట. ఏం చేయాలా? అని ఆలోచించిన చిరంజీవికి ఓ ప్లాన్ తట్టింది. వెంటనే దగ్గరలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెప్పి మళ్లీ వచ్చి కూర్చున్నారు. ఐదు నిమిషాల తర్వాత సదరు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఆ అమ్మాయికి వినపడేలా సార్..మిమ్మల్ని డైరెక్టర్గారు రమ్మంటున్నారు మీరు యాక్ట్ చేసొచ్చి మళ్లీ కూర్చోవచ్చు అని అన్నాడట. అప్పుడా అమ్మాయి చిరంజీవిని గమనించింది. అయితే చిరంజీవి అవేమీ పట్టించుకోకుండా వెళ్లి మళ్లీ పది నిమిషాల తర్వాత వచ్చి కూర్చున్నారు. అప్పుడామ్మాయి. ఎవండీ మీరు ఈ సినిమాలో నటిస్తున్నారా? అయితే ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని అడిగింది. మనసులో హ్యాపీగా ఫీలైన అయిష్టంగానే ముఖం పెట్టి ఆటోగ్రాఫ్ బుక్లో సంతకం పెట్టారట మెగాస్టార్ చిరంజీవి. అదే ఆయన తొలి ఆటోగ్రాఫ్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hPRCln
No comments:
Post a Comment