కరోనా మహమ్మారి ఎంటర్ అయింది.. వెండితెర వెలవెలబోయింది. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి. పలు భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్స్ నిలిచిపోయి థియేటర్స్ కళ తప్పాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వరుసపెట్టి స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే '' సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్న బాలయ్య బాబు.. తన తదుపరి ప్రాజెక్టును కూడా శరవేగంగా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ఎలా ఉంటుందనే దానిపై ఓ క్రేజీ లీక్ బయటకొచ్చింది. 'క్రాక్' డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హీరోగా రూపొందనున్న కొత్త సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నారు. అయితే బాలయ్య అభిమానుల కోసం మాస్ ఎలిమెంట్స్తో కూడిన పదునైన కథ సిద్ధం చేసుకున్న గోపీచంద్ మలినేని.. ఆయనను చాలా పవర్ఫుల్ రోల్స్లో చూపించబోతున్నారని టాక్. భారీ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల్లో ఊపు తెప్పించేలా ఈ సినిమా ఉండాలని భావిస్తున్న డైరెక్టర్.. ఇందులో బాలయ్య బాబును రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్లో ప్రెజెంట్ చేయబోతున్నారని సమాచారం. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ రోల్ కాగా మరొకటి ఫ్యాక్షనిస్ట్ రోల్ అని అంటున్నారు. ఇప్పటికే ఈ రెండు పాత్రల గెటప్స్ విషయంలో ఓ ఐడియాకు వచ్చిన ఆయన.. సిల్వర్ స్క్రీన్పై మెరుపులు మెరిపించేలా బాలయ్య కోసం పవర్ఫుల్ డైలాగ్స్ కూడా రాసుకున్నారట. ఎక్కువభాగం రాయలసీమ, కర్ణాటక బార్డర్లో షూటింగ్ చేయనున్నారట. ఇకపోతే ఈ మూవీ కోసం '' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారని తెలుస్తోంది. హీరోయిన్లుగా త్రిష, ఇలియానా పేర్లు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు అతిత్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VZ1UrG
No comments:
Post a Comment