హాట్ బ్యూటీని టార్గెట్ చేసి‌న ఈడీ.. జాక్వెలిన్ వ్యవహారాలపై కన్నేసిన ఆఫీసర్స్! 200 కోట్ల స్కామ్..

టాలీవుడ్‌లో డ్రగ్స్ ఇష్యూ మరోసారి ప్రకంపనలు రేపుతోంది. పలువురు సినీ ప్రముఖులను (ED) అధికారులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ పెడల్స్‌తో సెలబ్రిటీలకున్న సంబంధాలు, కెల్విన్‌తో ఆర్ధిక లావాదేవీలపై దృష్టి పెట్టింది ఈడీ. దీంతోపాటు మ‌రోవైపు బాలీవుడ్ మ‌నీలాండ‌రింగ్‌, డ్రెగ్ కేసులోనూ కొంద‌రిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను మనీ లాండరింగ్, దోపిడీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి విచారణకు పిలవడం హాట్ టాపిక్ అయింది. సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ ఇష్యూలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు జాక్వెలిన్ వ్యవహారాలపై నిఘా పెట్టారని సమాచారం. ఈ మేరకు మరోసారి ఆమెను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. అలాగే సెప్టెంబర్ 25 శనివారం నాడు ఫైనాన్షియల్ ప్రోబ్ ఏజెన్సీ ఢిల్లీ యూనిట్ ముందు హాజరు కావాలని అధికారులు నోటీసులు పంపారట. ఈ విచారణలో 200 కోట్ల స్కామ్ గురించి ఆరా తీయబోతున్నారట. అంతకుముందు ఆగస్టు 30వ తేదీన సుకేశ్ చంద్రశేఖర్‌పై కేసుకు సంబంధించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ విచారణలో ఆమె నుంచి సమాచారం సేకరించారు. దీంతో ఇక్కడితో ఈ కేసు నుంచి జాక్వెలిన్ బయటపడిందని అంతా భావించగా.. మరోసారి ఈడీ ఆమె విచారణ కోరడం చర్చనీయాంశం అయింది. అయితే తనపై వస్తున్న ఆరోపణలు అబద్దమని నిరూపించేందుకు జాక్వెలిన్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kh8pzp

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts