మెగా పవర్ స్టార్ బిగ్గెస్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో హుషారెత్తించబోతున్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్న ఆయన.. మరో బడా దర్శకుడు దర్శకత్వంలో ఓ సినిమాను లైన్లో పెట్టేశారు. దీంతో ఈ రెండు సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి. అయితే చెర్రీ విషయంలో రాజమౌళి ఎలాగైతే ప్లాన్ చేశారో శంకర్ కూడా అదే స్కెచ్ వేశారనేది తాజా సమాచారం. శంకర్ దర్శకత్వంలో భారీ రేంజ్లో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. చెర్రీ కెరీర్లో 15వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీకి దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఇందులో రామ్ చరణ్ సరసన ఏ హీరోయిన్ అయితే బెటర్ అనేదానిపై కసరత్తులు చేసిన శంకర్ టీం.. చివరకు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్కి ఓటేశారని తెలుస్తోంది. ఈ మేరకు ఆలియాతో సంప్రదింపులు కూడా ఫినిష్ అయ్యాయనేది లేటెస్ట్ టాక్. మొన్నటి వరకు హీరోయిన్గా కియారా అద్వానీని తీసుబోతున్నట్లు టాక్ రాగా తాజాగా ఆలియా భట్ పేరు తెరపైకి రావడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఆలియాను RRR సినిమా ద్వారా భారీ రేంజ్లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు రాజమౌళి. ఇందులో రామ్ చరణ్ సరసన సీతగా ఆమె కనిపించనుంది. ఇప్పుడు శంకర్ కూడా ఆమెనే ఫైనల్ చేశారని తెలుస్తుండటం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఇదే నిజమైతే ఇక ఆలియా టాలీవుడ్లో కూడా బిజీ హీరోయిన్ కావడం ఖాయమే అంటున్నారు ప్రేక్షకులు. ఇకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ 50వ చిత్రంగా ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో అత్యంత స్పెషల్గా ఉండాలని దిల్ రాజు భావిస్తున్నారట. భారీ బడ్జెట్ కేటాయించి, భారీ తారాగణంతో విజువల్ వండర్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రేక్షకులకు ఓ వినూత్న అనుభూతినిచ్చేలా 3D ఫార్మాట్లో రూపొందించాలని ఫిక్సయ్యారట.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3470D26
No comments:
Post a Comment