‘మహానటి’ పేరు చెప్పగానే ఒకప్పుడు సావిత్రి గుర్తుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆమె పాత్రను పోషించిన కీర్తి సురేష్ గుర్తుకొస్తున్నారు. అంతలా ఆ పాత్రలో జీవించేశారు కీర్తి. ఈ సినిమాలో హీరోయిన్ ఓరియెంటెడ్ కథలకు కీర్తి సురేష్ తగిన నటి అని నిరూపించుకున్నారు. ఓవైపు పెద్ద హీరోల సరసన హీరోయిన్గా చేస్తూనే నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అలాంటి అవకాశాలే కీర్తికి ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే ‘మిస్ ఇండియా’ అనే సినిమాను అంగీకరించారు. నరేంద్ర నాథ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మరోవైపు, ఇంకో లేడీ ఓరియెంటెడ్ మూవీని కూడా కీర్తి చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. నగేష్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నారు. సుధీర్ చంద్ర పదిరి నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. క్రీడా నేపథ్యంలో సాగే సినిమా ఇది. నవంబర్ 11 నుంచి హైదరాబాద్లో ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. నేడు (అక్టోబర్ 17న) కీర్తి సురేష్ పుట్టినరోజును పురష్కరించుకుని ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ను విడుదల చేసింది. దీపావళికి చిత్ర ఫస్ట్లుక్ను విడుదల చేయనున్నట్లు పోస్టర్లో పేర్కొంది. త్వరలోనే చిత్ర టైటిల్ను కూడా ప్రకటిస్తారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OTmIeg
No comments:
Post a Comment