స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు తన శైలికి తగ్గట్టుగా ‘అల... వైకుంఠపురములో...’ అనే టైటిల్ను పెట్టారు. ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యంమూర్తి’ సినిమాల తరవాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని ఈ ఇద్దరు స్టార్లు చూస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం దీపావళి పండుగనాడు అభిమానులకు అల్లు అర్జున్ అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు. దీపావళిని పురష్కరించుకుని అక్టోబర్ 27న ‘అల... వైకుంఠపురములో...’ టీజర్ను విడుదల చేయబోతున్నారట. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. Also Read: ఇటీవల విడుదలైన ‘సామజవరగమన’ అనే సాంగ్కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట అద్భుతంగా ఉందంటూ అంతా కొనియాడారు. ఈ పాటతో తమన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో ఇప్పుడు టీజర్పై బన్నీ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ టీజర్తో సినిమా అంచనాలు రెట్టింపు కావడం ఖాయం. కాగా, ‘అల.. వైకుంఠపురములో...’ హాలీవుడ్ సినిమా ‘ఇన్వెన్షన్ ఆఫ్ లయింగ్’ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయంలో స్పష్టత లేదు. ఎంత హాలీవుడ్ కథ ఆధారంగా తీసుకున్నా త్రివిక్రమ్ శైలి అయితే తెలుగు ప్రేక్షకులకు రీచ్ అవ్వడం ఖాయం. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VSfIjs
No comments:
Post a Comment