మెగా ఫ్యామిలీలో ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్గా మారిపోయారు. కుటుంబాన్ని అంతటిని కూడా కలిసికట్టుగా అంతే అన్యోన్యంగా ఉండేలా చూడటంలో ఉపాసనది గొప్ప పాత్ర అని చెబుతుంటారు. ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటూనే తన వ్యాపారాలు, హాస్పిటల్ వ్యవహారాలను కూడా చక్కబెట్టుకుంటారని అంటుంటారు. ఇక ఆమె చేసే సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్చంద సంస్థలతో కలిసి చేసే కార్యక్రమాలు ఇలా అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక ప్రత్యేక రోజుల్లో అయితే ఉపాసన తన సమయాన్ని కుటుంబానికి వెచ్చిస్తుంటారు. రామ్ చరణ్, చిరంజీవి, బర్త్ డేలు, ప్రత్యేక పండుగలు వస్తే మెగా ఇంట్లో ఉపాసన సందడి కనిపిస్తుంటుంది. ఇక తాజాగా నిన్న వరలక్ష్మీ పూజను కూడా మెగా కోడలు ఎంతో ఘనంగా చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఈ పూజలో నాలుగు తరాల వాళ్లు ఒకే చోట ఉన్నారని చెప్పుకొచ్చారు ఉపాసన. ఉపాసనతో పాటుగా అంజనమ్మ, సురేఖ కూడా పూజలో కూర్చున్నారు. వారితో పాటు శ్రీజ కూతురు నివృత్తి కూడా పూజలో పాల్గొన్నారు. అలా మెగా జనరేషన్స్ అన్నీ కూడా ఒకే చోటకు వచ్చాయి. అంజనమ్మ, సురేఖా, ఉపాసన, నివృత్తితో నాలుగు తరాలు ఒకే చోటకు వచ్చినట్టు అయ్యాయి. ఇదే విషయాన్ని ఉపాసన చెప్పుకొచ్చారు. నాలుగు తరాలు కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నామని ఓ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మొన్నే ఉపాసన ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు అక్కడ ఆర్ఆర్ఆర్ షూట్ను దగ్గరుండి వీక్షించిన సంగతి తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kazRxI
No comments:
Post a Comment