2017లో విడుదలైన అంగమాలి డైరీస్ చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన నటుడు అంటోనీ వర్గీస్ తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనస్సు దోచుకున్నాడు. అయితే త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్కి ఫుల్స్టాప్ పెట్టి.. మ్యారేజ్ లైఫ్లోకి అడుగుపెట్టబోతున్నాడు ఆంటోనీ తన చిన్ననాటి స్నేహితురాలు. అనిషా పౌలోస్తో కలిసి ఈ నెల 8వ తేదీన ఏడు అడుగులు వేయనున్నాడు. అంగమాలి డైరీస్ సినిమా సినిమా మంచి విజయం సాధిచడంతో మలయాళం ఇండస్ట్రీలో ఆంటోనీ మంచి క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలో వెన్సెంట్ పెపే అనే పాత్ర చేసిన ఆంటోనీ అప్పటి నుంచి ‘పెపే’ అనే పేరుతోనే పాపులర్ అయ్యాడు.. ‘జల్లికట్టు’, ‘స్వతంత్రం అర్థరాత్రి’ అనే సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరించాడు ఆంటోనీ. ప్రస్తుతం ఆయన అజగజంతరం, జాన్ మేరీ, ఆనప్రంబిలే వరల్డ్ కప్, ఆరవం చిత్రాలు చేస్తున్నాడు. ఇక అనిషా పౌలోస్ విషయానికొస్తే.. ఆమె వృత్తిరీత్య నర్సు. చిన్ననాటి నుంచి ఆంటోనీకి మంచి స్నేహితురాలు. కొన్ని సంవత్సరాల క్రితం వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరు రిలేషన్షిప్లో ఉండగా.. ఈ మధ్యే వీళ్ల పెళ్లికి పెద్దలు కూడా ఓకే చెప్పారు. తాజాగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగా హల్దీ ఫంక్షన్ నిర్వహించగా.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తనకు కాబోయే భార్యతో, బంధువులుతో కలిసి ఆంటోనీ డ్యాన్స్ చేయడం మనం గమనించవచ్చు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CkkRFK
No comments:
Post a Comment