బాలీవుడ్ టు హాలీవుడ్ ఆడియన్స్ అందరికీ సుపరిచితమై గ్లోబల్ ఐకాన్గా సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రాకు అరుదైన అవకాశం దక్కింది. ముంబై అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ () ఫిల్మ్ ఫెస్టివల్ చైర్ పర్సన్గా ఆమె నియమితులయ్యారు. గతంలో ఈ హోదాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఉండేవారు. ఆమె నుంచి ఈ పదవి బాధ్యతలు చేపట్టడంతో సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ప్రత్యేకంగా ట్వీట్ పెడుతూ ఆమెకు వెల్కమ్ చెప్పారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ చైర్ పర్సన్గా కొత్త బాధ్యతలను చేపట్టడంపై ప్రియాంక చోప్రా రియాక్ట్ అవుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ బాధ్యతలు దక్కడం గర్వంగా ఉందని చెబుతూ.. ప్రపంచానికి ఇండియన్ సినిమాను పరిచయం చేసే ఈ గొప్ప వేదికలో టాలెంటెడ్ నటులు, సాంకేతిక నిపుణులను కలవబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రపంచం భారతీయ సినీ పరిశ్రమను ఎలా చూస్తుందనే విషయంపై అవగాహన పెంచుకోవాలని, చాలా మందితో చర్చలు జరపాల్సి ఉందని ఆమె అన్నారు. దేశంలోనే అతిపెద్ద ఫెస్టివల్ MAMIకి చైర్మన్గా వ్యవహరించడం అరుదైన అవకాశమని చెప్పిన ప్రియాంక.. ఇది తన జీవితంలో కొత్త చాప్టర్ అని, ఈ బాధ్యత స్వీకరించడం పట్ల చాలా ఉత్తేజంగా ఉన్నానని తన ఫీలింగ్స్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ముంబై అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ (MAMI) ఫిల్మ్ ఫెస్టివల్ను గతేడాది కరోనా వ్యాప్తి కారణంగా ఆన్లైన్లో నిర్వహించారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు ఈ వేడుకను థియేటర్లలో నిర్వహించేందుకు అంతా సిద్దం చేశారు. అక్టోబర్ 21 నుంచి మార్చి 2022 వరకు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CUhMfH
No comments:
Post a Comment