నిర్భయ నిందితులను ఉరి తీయకూడదా: ప్రముఖ నటి షాకింగ్ వ్యాఖ్యలు

బాలీవుడ్‌లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి గళం విప్పి ‘మీటూ’ ఉద్యమానికి దారి తీశారు . ఆమె పుణ్యమా అని ఎందరో నటీమణులు, ఆర్టిస్ట్‌లు తమకు ఎదురైన అనుభవాలను బయటపెట్టగలిగారు. దాంతో తనుశ్రీపై చాలా మంది మంచి అభిప్రాయం ఏర్పడింది. కానీ తాజాగా తనుశ్రీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ ఘటనకు ఈ నెల 22న న్యాయం జరగనుంది. 22న నిర్భయ నిందితులను ఉరి తీయనున్నారు. దీనిపై తనుశ్రీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తన వ్యాఖ్యలతో అందరినీ షాక్‌కు గురిచేశారు. ఇంతకీ తనుశ్రీ ఏమన్నారంటే.. ‘‘నిర్భయ నిందితులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నిర్భయకు న్యాయం జరిగింది. మంచిదే. కానీ ఇలా ఎంతమందిని ఉరి తీసుకుంటూపోతారు? ఉరితీయడం కాకుండా ఇంకేదైనా పరిష్కారం గురించి నేనను ఆలోచిస్తున్నా. ఉరిశిక్ష, చావు అనేవి ఎప్పటికీ పరిష్కారం కావు. అత్యాచార ఘటనలకు ఫుల్‌స్టాప్ పడిన రోజు కోసం నేను చాలా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. తనుశ్రీ అభిప్రాయంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆమె అన్న వ్యాఖ్యలు ‘నిర్భయ’ నిందితులకు ఉరిశిక్ష వద్దు అని చెప్తున్నట్లుగా ఉన్నాయి. READ ALSO: దాంతో చాలా మంది నెటిజన్లు తనుశ్రీ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. వారిని ఉరితీయాలని నిర్భయ తల్లి ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మొత్తానికి నిర్భయ హంతకులకు ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులను తిహార్ జైల్లోని మూడో నంబర్ కారాగారంలో ఒకేసారి ఉరి తీయనున్నారు. పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడంతో.. ఏడేళ్ల తర్వాత నిర్భయకు న్యాయం జరగనుంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39V4XTR

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts