ప్రముఖ దర్శకుడికి అస్వస్థత.. పరిస్థితి విషమం

బాలీవుడ్‌ కిలాడీ హీరోగా మిషన్‌ మంగళ్ సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు అనారోగ్యానికి గురయ్యారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, ఆయన మెదడులో రక్తం గడ్డకట్టిందని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం జగన్‌ శక్తి ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కుటుంబం సభ్యులు ముంబై చేరుకున్నారు. ప్రముక వైధ్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతుందని సన్నిహితులు వెల్లడించారు. హాలీడే, ఇంగ్లీష్‌ వింగ్లీష్, డియర్‌ జిందగీ చిత్రాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేసిన జగన్‌ శక్తి, 2019లో రిలీజ్‌ అయిన మిషన్‌ మంగళ్ సినిమాతో దర్శకుడిగా మారారు. Also Read: తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌తో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఎక్కువగా అక్షయ్‌ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన జగన్‌ ఆయన తొలి చిత్రానికి కూడా అక్షయ్‌నే హీరోగా ఎంచుకున్నాడు. అంతేకాదు త్వరలో తాను తెరకెక్కించబోయే రెండో సినిమా కోసం కూడా అక్షయ్‌ కుమార్‌తోనే సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OflUiX

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts