ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్న తన నెక్ట్స్ సినిమాను కూడా ఇటీవల ప్రారంభించాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా చేయనున్నాడు బన్నీ. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించనుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీకి ప్రతినాయకుడిగా ఓ కోలీవుడ్ స్టార్ హీరో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తమిళ్లో విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న ఈ సినిమాలో విలన్గా నటించనున్నాడట. ఇటీవల సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించిన విజయ్, ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఎప్పెన సినిమాలోనూ నటిస్తున్నాడు. Also Read: తాజాగా మరో మెగా హీరో అల్లు అర్జున్ సినిమాలో నటించేందుకు కూడా ఈ స్టార్ హీరో సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నటనకు ఆస్కారం ఉంటూ భాష ఏదైనా, పాత్ర ఏదైనా చేసేందుకు ఓకే అంటున్నాడు విజయ్ సేతుపతి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా వినిపించాడట. అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు విజయ్కి భారీ పారితోషికం ఆఫర్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. Also Read: తెలుగులో యంగ్ జనరేషన్ హీరోలు చాలా మంది తీసుకునే పారితోషికం కన్నా ఎక్కువగా దాదాపు కోటిన్నర రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. కథ, క్యారెక్టర్తో పాటు రెమ్యూనరేషన్ కూడా నచ్చటంతో విజయ్ కూడా నటించేందుకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక బన్నీ ప్రస్తుతం నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. Also Read: ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్తో కలిసి అల్లు అరవింద్ సినిమాను నిర్మి్స్తున్నాడు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NyVt6p
No comments:
Post a Comment