రామ్ చరణ్ మాటమీద నిలబడ్డాడు.. మహేష్ వల్లే ఇదంతా?

ఇండస్ట్రీలో ఎక్కువమంది హీరోలతో ఫ్రెండ్‌షిప్ ఉంది రామ్ చరణ్‌కి. అదేదో హాయ్..బాయ్ ఫ్రెండ్షిప్ కూడా కాదు, మంచి బాండింగ్ ఉంది. ఎన్టీఆర్ అయితే ఆల్మోస్ట్ బ్రదర్. పండగలు కూడా రెండు ఫ్యామిలీస్ కలిపి సెలబ్రేట్ చేసుకునేంత ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే RRR లో కూడా మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని వాళ్ళిద్దరిని కలిపి సినిమా స్టార్ట్ చేసాడు రాజమౌళి. ఎన్టీఆర్‌తో ఎంత క్లోజ్‌గా ఉంటాడో మహేష్ బాబుతో కూడా అంతే క్లోజ్‌గా ఉంటాడు చెర్రీ. అయితే రంగస్థలం టైమ్‌లో ఒక చిన్న ఇన్సిడెంట్‌తో మాత్రం వల్ల రామ్ చరణ్ హర్ట్ అయ్యాడు అని టాక్ నడించింది. Also Read: రంగస్థలం బంపర్ హిట్ టాక్ రావడంతో మూడు రోజులకు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అనే పోస్టర్ వేసి సక్సెస్ మీట్ పెట్టారు. అది ఆ రేంజ్ ఉన్న సినిమా. కలెక్షన్స్ కూడా జెన్యూన్ అని ట్రేడ్ విశ్లేషించారు. అందుకు తగ్గట్టే ఆ సినిమా కూడా చాలా ఏరియాల్లో కూడా నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన 20 రోజులకు మహేష్ హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా కూడా బావుంది అన్నారు. హిట్ అనే టాక్ వచ్చింది. కానీ ఆ సినిమా కలెక్షన్స్ మాత్రం ఆశించినంతగా లేవు అని అప్పట్లో చర్చ నడించింది. కానీ వారం తిరిగేలోపు మాత్రం రంగస్థలం సినిమాకి మించిన కలెక్షన్స్‌తో ప్రొడక్షన్ హౌస్ నుండి పోస్టర్స్ బయటికి వచ్చాయి. Also Read: ఇలా అప్పట్లో చెర్రీ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ మధ్య ఫేక్ కలెక్షన్స్ అనే వార్ కొన్ని రోజులు నడించింది. సోషల్ మీడియాలో కూడా ఆ హడావిడి కూడా ఎక్కువగానే కనిపించింది. భరత్ అనే నేను సినిమాకి అలా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ వెళ్ళారు. అయితే ఆ ఇన్సిడెంట్‌తో చరణ్ హర్ట్ అయ్యాడు అని అతని సన్నిహితులు కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు రామ్ చరణ్. ఇక నుండి తన సినిమాల పోస్టర్స్ పై కలెక్షన్స్‌కి సంబదించిన అంకెలు ఉండవు అని చెప్పాడు. అయితే ఇప్పుడు తన సినిమానే కాదు, తన ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన ప్రెస్టీజియస్ సినిమా నరసింహారెడ్డికి కూడా పోస్టర్స్ పై కలెక్షన్స్ వెయ్యడం అనేది బ్యాన్ చేసాడు. Also Read: అందుకే సైరా సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజలు అవుతున్నా, ఆ సినిమా కలెక్షన్స్ 200 కోట్ల మార్క్‌కి చేరువలో ఉన్నా కూడా రాంచరణ్ మాత్రం అసలు కలెక్షన్స్ వేసి ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చెయ్యలేదు. అలా కాకుండా 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు అని పోస్టర్స్ రిలీజ్ చేసి ఉంటే కలెక్షన్స్ కాస్త పెరిగేవి. కానీ చరణ్ మాత్రం అలా చెయ్యలేదు. అన్నమాట మీదే ఉన్నాడు. త్రివిక్రమ్‌తో ఇంటర్వ్యూ లో కూడా కలెక్షన్స్ అనేది ప్రొడక్షన్ హౌస్ చెప్పాల్సిన పనిలేదు అంటూ సింపుల్‌గా తేల్చేసాడు. కానీ రామ్ చరణ్ నిర్ణయం వెనుక అసలు నిజం మాత్రం అప్పటి ఇన్‌డైరెక్ట్ గొడవే అనేది ఇండస్ట్రీలోని ప్రముఖుల ఉద్దేశం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/329I5Mp

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts