అంకుల్ ఏంటి.. అంకుల్? నాకైతే అస్సలు నచ్చలేదు.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్

నందమూరి ప్రస్తుత వయసు 61 సంవత్సరాలు. అయితే ఇప్పటికీ యంగ్ ఏజ్‌లో ఉన్న అదే ఎనర్జీతో సినిమాలు చేస్తూ వస్తున్నారు బాలయ్య బాబు. ఈ నేపథ్యంలోనే నిన్న (డిసెంబర్ 2) ఆయన హీరోగా చేసిన '' మూవీ గ్రాండ్‌గా రిలీజ్ అయింది. తొలి షోతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడం, కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి పూర్వ వైభవం వచ్చేలా ఇదే మూవీ పునాది వేయడం పట్ల ఆనందంగా ఉంది చిత్ర యూనిట్. ఇదే ఆనందంతో ప్రెస్ మీట్ పెట్టి అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన బాలయ్య బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని ఆధరిస్తుంటారని, అదే తెలుగు వారి ప్రత్యేకతగా బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తొలి షోతోనే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమాను అభిమానులతో కలిసి హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో ఆయన వీక్షించారట. అయితే ఇంటర్వెల్ సమయంలో తన దగ్గరికి కొంతమంది పిల్లలు వచ్చి అంకుల్ సినిమా అద్భుతంగా ఉందని అన్నారని చెప్పిన బాలకృష్ణ.. తనను ఇలా అంకుల్ అనడం ఏమీ బాగోలేదని, తనకది నచ్చలేదంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. అఖండ మూవీ కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో కష్టపడ్డారని, ఈ సినిమాలో ఎన్నో నిజాల్ని చూపించామని బాలకృష్ణ అన్నారు. ఇది కేవలం తమ చిత్ర విజయం కాదని, చలన చిత్ర పరిశ్రమ విజయమని చెప్పారు. షూటింగ్ సమయంలో ఆర్టిస్టులంతా ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కొని దృఢ సంకల్పంతో పని చేశారని అన్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను- నటసింహం బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా ఈ అఖండ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించారు. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటించగా.. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించారు. తమన్ బాణీలు కట్టారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3G6QAeA

Acharya హైలైట్స్ రెడీ.. కొర‌టాల శివ టెన్ష‌న్‌!

మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో హీరోల ఫ్యాన్స్ మెచ్చేలా, ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్‌, డైలాగ్స్‌తో ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కించ‌డంలో దిట్ట డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ప్రస్తుతం ఈయ‌న డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ఆచార్య‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. పిబ్ర‌వ‌రి 4న విడుల‌ద‌వుతుంది. మెగాస్టార్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్ర‌మిది. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇందులో సిద్ధ అనే ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఇది వ‌ర‌కు మ‌గ‌ధీర‌, బ్రూస్‌లీ, ఖైదీ నంబ‌ర్ 150 చిత్రాల్లో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టించినప్ప‌టికీ అది చిన్న డాన్స్ బిట్టో లేక ఏదో ఒక స‌న్నివేశం వ‌ర‌కు ప‌రిమితం అయ్యింది. అయితే తొలిసారి చిరంజీవి, చ‌ర‌ణ్ స‌మాన ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ఆచార్య‌. రీసెంట్‌గా ఈ సినిమా సిద్ధ క్యారెక్ట‌ర్‌ టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అందులో రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌ధారి అయిన సిద్ధ రోల్ ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని చూఛాయ‌గా చూపించారు. అయితే ఇదే టీజ‌ర్ చివ‌ర‌లో చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటే.. చిరుత కాపాలాగా ఉండే సీన్ చూపిస్తునే చిరంజీవి, చ‌ర‌ణ్‌ను చూపించారు. ఈ సీన్ ఫ్యాన్స్‌కు, ప్రేక్ష‌కుల‌కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింది. ఆచార్యలో సిద్ధ క్యారెక్ట‌ర్ టీజ‌ర్‌కు, ఆ టీజ‌ర్ చివ‌ర‌లో చూపించిన చిరంజీవి-చ‌ర‌ణ్ కాంబో సినీన్ గురించి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో కొర‌టాల శివ మాట్లాడారు. ‘‘క‌థ‌ను త‌యారు చేస్తున్న స‌మ‌యంలో ఏమీ అనిపించ‌లేదు. అయితే షూటింగ్ స‌మ‌యంలో చిరంజీవి, చ‌ర‌ణ్‌ల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల‌నుకోగానే కాస్త టెన్ష‌న్‌గా అనిపించింది. ఎందుకంటే ఇద్ద‌రూ పూర్తిస్థాయి పాత్ర‌ల్లో న‌టిస్తోన్న తొలి చిత్ర‌మిది. భ‌విష్య‌త్తులో ఇలాంటి రోల్స్ చేస్తారో లేదో తెలియ‌దు. కాబ‌ట్టి సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయి. కాబ‌ట్టి దాన్ని బాగా చూపించాల‌ని అనుకున్నాను. అదే నా టెన్ష‌న్‌కు కార‌ణ‌మైంది. అయితే చిరంజీవిగారు, చ‌ర‌ణ్ క‌లిసి నా టెన్ష‌న్‌ను దూరం చేసేశారు. వారిద్ద‌రూ క‌లిసి న‌టించిన కొన్ని స‌న్నివేశాల‌ను మారేడుమిల్లి అడ‌వుల్లో 15 రోజుల పాటు చిత్రీక‌రించాం’’ అన్నారు కొరటాల శివ. ఇంకా ‘ఆచార్య‌’ సినిమా గురించి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నుంచి మరో రెండు సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయి. అందులో చిరంజీవి-చ‌ర‌ణ్ క‌లిసి డాన్స్ చేసిన పాట‌ను విడుద‌ల చేస్తాం. అలాగే సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తాం. ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి, చ‌ర‌ణ్ క‌లిసి పూర్తి సాంగ్ డాన్స్ చేయ‌లేదు. కానీ తొలిసారి ఆచార్య‌లో పూర్తి పాట‌కు చిరంజీవి, చ‌ర‌ణ్ క‌లిసి డాన్స్ చేయ‌డం మీరు చూస్తారు’’ అన్నారు కొరటాల. ఈ చిత్రంలో చిరంజీవి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌. చ‌ర‌ణ్ జోడీగా పూజా హెగ్డే న‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ocTgBi

Akhanda : బాలయ్య మాస్ జాతర.. మహేష్ బాబు అలా రామ్ ఇలా

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ వచ్చేసింది. సినిమాతో దుమ్ములేపేశారు. ఇప్పటికే సింహా, లెజెండ్ సినిమాలతో బాలయ్య బోయపాటి రికార్డులు బద్దలు కొట్టేశారు. ఇక ఇప్పుడు అఖండతో మాస్ జాతరను చూపించేశారు. మొత్తానికి థియేటర్లు మాత్రం జాతరను తలిపిస్తున్నాయి. అఖండ విడుదలైన ప్రతీ చోటా పండుగ వాతావరణం కనిపించింది. ఇక సెకండ్ లాక్డౌన్ తరువాత విడుదలైన పెద్ద సినిమా, ఈ రేంజ్‌లో సక్సెస్ అవ్వడంతో ఇండస్ట్రీలో సంబరాలు నెలకొన్నాయి. అఖండ ఇలా హిట్ అవ్వడంతో రాబోయే సినిమాల్లో మంచి ఉత్సాహం నింపుతున్నట్టు అయింది. తాజాగా అఖండ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. దీనిపై సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇస్మార్ట్ హీరో పోస్ట్‌లు పెట్టేశారు. అఖండ చిత్రయూనిట్‌కు కంగ్రాట్స్ తెలిపారు. అఖండతో అద్భుతమైన ఆరంభం.. ఎంతో సంతోషంగా ఉంది. , బోయపాటి శ్రీను గారికి, చిత్రయూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ అని ట్వీట్ వేశాడు. ఇక ఇస్మార్ట్ హీరో రామ్ సైతం అఖండ విజయోత్సవాల మీద స్పందించాడు. అఖండ గురించి అద్భుతమైన స్పందన వినిపిస్తోంది.. బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారికి, ద్వారకా క్రియేషన్స్, తమన్, ప్రగ్యా జైస్వాల్ అందరికీ కంగ్రాట్స్. తెలుగు సినిమా వేవ్ మళ్లీ మొదలైంది అని రామ్ ట్వీట్ వేశాడు. మొత్తానికి బీబీ3 అంటూ వచ్చిన అఖండ దెబ్బకు థియేటర్లు దద్దరిల్లిపోతోన్నాయి. అఘోర పాత్రను బోయపాటి మలిచిన తీరు, ఆ యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్స్, తమన్ నేపథ్య సంగీతం ఇలా ప్రతీ ఒక్కటీ మాస్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇక మున్ముందు రాబోయే పెద్ద సినిమాలతో థియేటర్ల వద్ద హంగామా ఉండనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rzzSRb

అఖండ.. మాస్, ఫ్యాన్స్ మెచ్చే సినిమా

Movie: నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌లనాల‌ను సృష్టించాయి. మాస్ హీరోగా బాల‌య్య‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించ‌డంలో బోయ‌పాటి శ్రీను త‌న‌దైన మార్కును చూపించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మూడో సినిమాగా ‘అఖండ‌’ను అనౌన్స్ చేయ‌గానే అభిమానులు సంతోష‌డ్డారు. ఆటోమెటిక్‌గా సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. అస‌లు బోయ‌పాటి ఈసారి బాల‌కృష్ణ‌ను ఎలా చూపిస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూశారు. త‌న గ‌త రెండు చిత్రాల త‌ర‌హాలోనే ఈ సినిమాలో బాల‌కృష్ణ‌తో ద్విపాత్రాభిన‌యం చేయించారు బోయపాటి. సినిమా పోస్టర్స్‌, బాల‌కృష్ణ లుక్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమా ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత పెంచాయి. డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం మ‌రి ఈ అంచనాల‌ను ఏ మేర‌కు అందుకుందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం... క‌థ‌: గ‌జేంద్ర సాహు అనే పేరు మోసిన టెర్ర‌రిస్ట్ పోలీసుల ఎన్‌కౌంట‌ర్ నుంచి త‌ప్పించుకుని మ‌హారుద్ర పీఠంను చేరుకుంటాడు. త‌న‌ను ఇబ్బంది పెట్టిన ఈ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని పీఠాధిప‌తిని చంపి తానే పీఠాధిప‌తిగా మారుతాడు. అదే స‌మ‌యంలో అనంత‌పురంలో రామచంద్ర‌రాజు అనే వ్య‌క్తికి మ‌గ క‌వ‌ల‌లు పుడ‌తారు. వారిలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంటే, మ‌రో బిడ్డ ఉలుకు ప‌లుకు లేకుండా ఉంటాడు. అదే స‌మ‌యంలో వారింటిలోకి అడుగు పెట్టిన అఘోరా (జ‌గ‌ప‌తిబాబు) చ‌నిపోయిన బిడ్డ‌ను తీసుకెళ్లిపోతాడు. చ‌నిపోయిన బిడ్డ కాశీ విశ్వ‌నాథుడి స‌న్నిధానానికి చేరుకుంటాడు. ప‌ర‌మేశ్వ‌రుడి దయ‌తో ఆ బిడ్డ ఊపిరి పోసుకుంటుంది. కొన్నేళ్ల త‌ర్వాత ఆ పిల్ల‌లు పెరిగి పెద్ద‌వార‌వుతారు. అనంత‌పురంలో పెరిగిన బిడ్డ ముర‌ళీకృష్ణ (నంద‌మూరి బాల‌కృష్ణ‌) అక్క‌డ ఫ్యాక్ష‌నిజం రూపుమాప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఆ ప్రాంతంలో స్కూల్స్‌, హాస్పిటల్స్ క‌ట్టించి ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంటాడు. ముర‌ళీ కృష్ణ చేసే మంచి ప‌నులు చూసి ఆ ప్రాంతానికి వ‌చ్చిన కలెక్ట‌ర్ శ‌రణ్య (ప్ర‌గ్యా జైశ్వాల్‌) అత‌న్ని ప్రేమిస్తుంది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటారు. మ‌రో వైపు.. అదే ప్రాంతంలో కాప‌ర్ మైనింగ్ వ్యాపారం చేసే వ‌ర‌దరాజులు (శ్రీకాంత్‌)కి, త‌న మైన్‌లో యురేనియం ఉంద‌ని తెలియ‌డంతో దాన్ని వెలికి తీసే ప‌నుల్లో బిజీగా ఉంటాడు. అక్కడ వ‌చ్చే వ్య‌ర్థాల‌ను భూమిలోకి పంపేయ‌డంతో చిన్న పిల్ల‌లు చనిపోతారు. విష‌యం తెలుసుకున్న ముర‌ళీ కృష్ణ ..వ‌ర‌దరాజుల‌కి ఎదురెళ‌తాడు. అప్పుడు ఓ ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగిన ప‌రిస్థితుల న‌డుమ ముర‌ళీ కృష్ణ క‌ట్టించిన హాస్పిట‌ల్‌లో బాంబ్ పేలుతుంది. మినిష్ట‌ర్ చ‌నిపోతాడు. దాంతో ముర‌ళీకృష్ణ‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. శ‌రణ్య‌ను చంప‌డానికి వ‌ర‌ద‌రాజులు ప్ర‌య‌త్నిస్తాడు. అప్పుడే రంగ ప్ర‌వేశం చేస్తాడు. అస‌లు అఖండ ఎవ‌రు? వ‌ర‌ద‌రాజుకి ఎందుకు ఎదురెళతాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేష‌ణ‌: అన్యాయం జ‌రిగి అమాయ‌కులు, చిన్న పిల్ల‌లు అకార‌ణంగా చనిపోతున్న‌ప్పుడు అక్క‌డ‌కు దేవుడు ఏదో ఒక రూపంలో వ‌చ్చి ఆదుకుంటాడు అనే పాయింట్‌ను మ‌రోసారి బోయపాటి శ్రీను అఖండ రూపంలో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఈసారి అఘోర పాత్ర‌ను త‌న క‌థ‌కు లింక్ చేసి చేయ‌డం విశేషం. సింహా, లెజెండ్ చిత్రాల్లో బాల‌కృష్ణ ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించిన బోయ‌పాటి శ్రీను ఈసారి ఆయ‌న్ని తెర‌పై ఎలా ఆవిష్క‌రిస్తారోన‌ని ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఇంత‌కు ముందు ప్ర‌స్తావించిన‌ట్లు సింహా, లెజెండ్ త‌ర‌హాల్లో మ‌రోసారి బాల‌య్యను డ్యూయెల్ రోల్‌లో చూపించాడు బోయ‌పాటి. ఒక పాత్ర‌ను రాయ‌ల‌సీమ రైతుగా ఎలివేట్ చేస్తే మ‌రోటి అఘోర పాత్ర‌. ఈ రెండు పాత్ర‌ల‌ను బ్యాలెన్స్ చేస్తూ త‌ను చెప్పాల‌నుకున్న ఎలిమెంట్‌ను మాస్‌కు, ఫ్యాన్స్‌కు క‌నెక్ట్ అయ్యేలా డైలాగ్స్‌తో, యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో బోయ‌పాటి అఖండ‌ను తెర‌కెక్కించారు బోయపాటి శ్రీను. అఖండ, మురళీ కృష్ణ పాత్ర‌ల‌కు అంతే ప‌వ‌ర్‌ఫుల్‌గా త‌న‌దైన పవర్‌ఫుల్, మాస్ న‌ట‌న‌తో, డైలాగ్ డెలివరీతో ప్రాణం పోశారు హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఫ‌స్టాఫ్ అంతా రాయ‌ల‌సీమ పాత్ర‌ధారి మురళీకృష్ణ పైనే ఎక్కువగా క‌థ ర‌న్ అవుతుంది. అనంత‌పురంలో ఫాక్ష్య‌నిజం రూపుమాప‌డానికి పాటు ప‌డే రైతు మురళీ కృష్ణ పాత్ర‌లో ధీరోదాత్తుడిగా బాల‌కృష్ణ క‌నిపించారు. యాక్ష‌న్ సీన్స్‌లోనూ బాల‌య్య న‌ట‌న మ‌రో రేంజ్‌లో ఉంటుంది. ప్ర‌తి సీన్ ఎలివేష‌న్ సీన్‌ రేంజ్లో మ‌లిచారు డైరెక్ట‌ర్‌. ఇక ఇంట‌ర్వెల్ ముందు అఖండ పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఆ పాత్ర ఎంట్రీ త‌ర్వాత యాక్ష‌న్ పార్ట్ ఎక్కువ‌గా అనిపిస్తుంది. క‌థానుగుణంగా విల‌న్స్ భ‌ర‌తం ప‌డుతూ సంద‌ర్భానుసారం చెప్పే డైలాగ్స్‌కు థియేటర్స్‌లో విజిల్స్ ప‌డ‌టం ఖాయం. త‌మ‌న్ త‌న సంగీతంతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. జై బాల‌య్య సాంగ్ అంద‌రినీ మెప్పిస్తుంది. అలాగే బాల‌కృష్ణ‌, ప్ర‌గ్యా మ‌ధ్య వ‌చ్చే అడిగా అడిగా సాంగ్‌.. రొమాంటిక్‌గా సాగుతుంది. ఇదే పాట‌లో క‌థ‌ను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారు డైరెక్ట‌ర్ బోయ‌పాటి. సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్‌గా సాగే మ‌రో సాంగ్ వ‌స్తుంది. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం.. ముఖ్యంగా అఖండ పాత్ర‌కు ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్ర‌ధాన ఆయువుగా నిలిచింది. రాం ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ఎప్ప‌టిలాగానే బాల‌కృష్ణ‌, బోయ‌పాటి సినిమాకు ఎం.ర‌త్నం మాట‌లు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. విధికి, విధాత‌కు స‌వాళ్లు విస‌ర‌కూడ‌దుఒక మాట నువ్వంటే శ‌బ్దం అదే నేనంటే శాస‌నందేవుణ్ని క‌రుణించ‌మ‌ని అడ‌గాలి క‌నిపించ‌మ‌ని కాదునిన్ను అంచ‌నా వేయ‌డానికి నువ్వేమైనా పోలవ‌రం డ్యామా.. ప‌ట్టిసీమ తూమా.. పిల్ల కాలువ‌వి..ప‌లు సంద‌ర్భాల్లో సాధార‌ణ మ‌నుషులు, యోగులు ఎలా ఉంటారో చెప్పే బోత్ ఆర్ నాట్ సేమ్ అనే సిట్యువేష‌న‌ల్ డైలాగ్ ఇలా.. పలు సంద‌ర్భాల్లో ఎం.ర‌త్నం డైలాగ్స్ స‌న్నివేశాల‌కు బ‌లాన్నిచ్చాయి. బోయ‌పాటి స‌న్నివేశాల‌ను ఎలివేట్ చేసిన తీరు సింహా, లెజెండ్‌కు మించి ఉంది. అందుకు కార‌ణం.. ఈసారి ఆయ‌న క్యారెక్ట‌ర్స్ ఎలివేష‌న్‌పై ఫోక‌స్ పెట్ట‌డ‌మే. అఖండ పాత్రలో బాల‌య్య ప్రతి సీన్‌ను ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌లా చూపించే ప్ర‌య‌త్నం చేశారు డైరెక్టర్ బోయపాటి. ఇక రాయ‌ల‌సీమ పాత్ర‌ధారిగా బాల‌య్య చేసిన పాత్ర ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌లో కోడెద్దులు ప‌రిగెత్తుకుంటూ వ‌స్తుంటే వాటి మ‌ధ్య నుంచి ఆయ‌న న‌డిచి వ‌చ్చిచేసిన ఫైట్ ఫ్యాన్స్‌, మాస్‌ను ఆక‌ట్టుకుంటుంది. ఇక సినిమాలో ఫ‌స్టాఫ్ లెంగ్తీగా అనిపిస్తుంది. అలాగే సినిమాలో వ‌యొలెన్స్ డోస్ ఎక్కువైంది. అఖండ పాత్ర‌ధారి అంద‌రినీ చంపుకుంటే వెళ్లిపోతుంటాడు. ఆయ‌న్ని పోలీసులు ఏమీ అన‌రు. ఎన్ఐఏ ఆఫీస‌ర్ ప్ర‌శ్నిస్తున్నా బాల‌కృష్ణ స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డం.. క్లైమాక్స్‌లో అఖండ పాత్ర‌ధారిని చంపాల‌నుకున్న విల‌న్స్ ద‌గ్గ‌ర గ‌న్స్ ఉన్నా.. ఎందుక‌నో క‌త్తులు, గొడ‌ళ్ల‌ను ఉప‌యోగించ‌డం.. ఇలా కొన్ని సీన్స్ అన్‌లాజిక‌ల్‌గా అనిపిస్తాయి. లాజిక‌ల్‌గా క‌రెక్ట్ కాక‌పోయినా.. క‌మ‌ర్షియ‌ల్ మూవీ కాబ‌ట్టి ఓకే అనుకోవాల్సిందే. ప్ర‌గ్యా జైశ్వాల్ పాత్ర ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించింది. పూర్ణ పాత్రకు స్కోప్ త‌క్కువే. అయితే ఉన్నంత‌లో చ‌క్క‌గా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు కూడా అఘోర బాబాగా చిన్న పాత్ర‌లోనే క‌నిపించాడు. ఇక మిగిలిన పాత్ర‌ధారులంద‌రూ కూడా ఓకే అనిపించారు. శ్రీకాంత్ విల‌నిజాన్ని చ‌క్క‌గానే చూపించారు. అయితే లెజెండ్‌లో జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌కున్న స్కోప్ శ్రీకాంత్ పాత్ర విల‌నిజంలో క‌నిపించ‌దు. కూల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను చూడాల‌నుకునే ప్రేక్ష‌కులు సినిమాలో మాస్ ఎలిమెంట్స్‌కు క‌నెక్ట్ కారు. అఖండ... మాస్‌ ఆడియెన్స్, నంద‌మూరి ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే మూవీ


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dgxEgQ

RRR Naatu Naatu hits 1M likes on YouTube

RRR Naatu Naatu hits 1M likes on YouTube
RRR Naatu Naatu hits 1M likes on YouTube

On 10th November, the RRR – Roudram Ranam Rudhiram team released Naatu Naatu song featuring Jr NTR and Ram Charan. The Telugu song Naatu Naatu from SS Rajamouli’ magnum opus has turned into a favorite for many Instagram users. Crooned by Rahul Sipligunj and Kaala Bhairava, the hit track has now prompted a new trend on Instagram.

Under the trend,  the people are showcasing the hook steps from the dance video with or without their own twists. Now according to the latest report, Naatu Naatu song from RRR has hit 1 Million likes on Youtube. Today the makers confirmed the same by sharing a new poster on their official twitter handle.

Jr NTR and Ram  Charan’ RRR second single Naatu Naatu became a mark of celebration for fans who have been patiently waiting for this event of a film. The music is composed by the veteran composer MM Keeravaani. In their career so far,   Ram  Charan and Tarak  have individually given some great dancing tracks, and  the song Naatu Naatu is yet another treat.

RRR which is being bankrolled by DVV Danayya, also has  Alia Bhatt, Samuthirakani,  Shriya Saran, Olivia Morris and Ajay Devgn in the crucial roles. The movie is slated to hit the theaters on 7th January 2022.

Also Read:

Official: RRR trailer not releasing on 3rd December

Ram Charan confession: His three different shades in RRR

RRR and Adipurush Sita rock the dance floor for Public at Delhi wedding



from NEWS – Tollywood https://ift.tt/3poxrOF

Mahesh Babu sister Priyadarshini files police complaint

Mahesh Babu sister Priyadarshini files police complaint
Mahesh Babu sister Priyadarshini files police complaint

Telugu superstar Mahesh Babu‘ sister and Sudheer Babu‘s wife Priyadarshini filed a complaint against socialite Shilpa Chowdary. According to the reports,  superstar Krishna’s daughter Priyadarshini approached Narsingh police and filed a complaint against Shilpa Chowdary  and alleged that  she cheated Rs 2.9  Cr promising in the name of high returns.

It is known that Narsingi police have intensified the investigation into the multi-crore fraud case of socialite turned Telugu  producer T Shilpa Chowdary and her husband T Srinivas Prasad. The police are saying  that the couple targeted   rich  people from film industry, politicians and business families and invited them for theme based parties, kitty parties and other social gatherings organized at the  farm houses, resorts, etc.

Priyadarshini said that she came in touch with Shilpa Chowdary through kitty parties and convinced her to invest in the real estate business.

The list of Shilpa Chowdary victims is growing with each passing day.  Several other people who were allegedly cheated by the couple, have also approached the police. Now, Sudheer Babu’s wife and Mahesh Babu’s sister Priya has approached the cops.  Priyadarshini had lodged a complaint with the Narsingi police.

On the otherside, currently Mahesh Babu is working with Parasuram for an upcoming film Sarkaru Vaari Paata which is slated to hit the theaters on 1st April.

Also Read:

Mahesh Babu to undergo knee surgery

Mahesh Babu and Jr NTR donate big to flood victims in AP

Now it’s time for Vijay Deverakonda Vs Mahesh Babu : Liger Vs Sarkaru Vaari Paata



from NEWS – Tollywood https://ift.tt/3xKnONT

Allu Arjun donates Rs 25 lakh for Andhra Flood Relief

Allu Arjun donates Rs 25 lakh for Andhra Flood Relief
Allu Arjun donates Rs 25 lakh for Andhra Flood Relief

Over 44 people have died and many are missing as heavy rains have caused floods in the coastal areas of Andhra Pradesh. An Orange alert has been declared for heavy rains in regions including Prakasam, Nellore, Chittoor, and Kadapa.  Meanwhile, Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy has requested the Centre to sanction Rs 1,000 Cr  for interim relief to the state. Megastar Chiranjeevi, Ram Charan, Mahesh Babu and Jr NTR from the Tollywood industry have come forward to help those who have been affected due to floods in Andhra Pradesh.   Today Icon Star Allu Arjun  also  responded and he  contributed Rs 25 lakh towards AP Chief Minister Relief Fund .

Sarrainodu star Allu Arjun  tweeted: My heart goes out to the people of Andhra Pradesh who have been affected by the recent floods. I am making a contribution of Rs 25 lakh towards  AP CMRelief Fund to aid with the rehabilitation efforts.

Chiranjeevi who also contributed Rs 25 Lakhs, said, “Pained by the widespread devastation and havoc caused by floods and torrential rains in Andhra Pradesh. Making a humble contribution of Rs.25 lacs towards Chief Minister Relief Fund to help aid relief work.”

On the work front,  Allu Arjun will be seen sharing the screen space with Kannada lady Rashmik Mandanna in Pushpa: The Rise, under the direction of Sukumar.

Also Read:

Pushpa: The Rise Trailer First review: Allu Arjun to SHOCK Indian Nation with his Terrific New Avatar

Allu Arjun item girl reading book in bikini

Prabhas – A chief guest for Allu Arjun Pushpa: The Rise pre release event



from NEWS – Tollywood https://ift.tt/3rBGONk

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts