ప్రస్తుతం హీరో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నారు. ఆయన సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకోవడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ ఎంగేజ్మెంట్ ఒకెత్తు అయితే ఇప్పుడు ఇచ్చిన షాక్ మరో ఎత్తు. ఇంత వరకు ఆయన చేసుకోబోయే బంధువుల అమ్మాయి అంటూ కథనాలు వచ్చాయి. కానీ అసలు విషయాన్ని కాసేపటి క్రితమే రివీల్ చేసేశారు మన హీరో. అసలు కథ కాలేజ్లోనే మొదలైందని అప్పటి నుంచి ఈ బంధం కొనసాగుతూ వచ్చిందని చెప్పుకొచ్చారు. తనకు కాబోయే భార్య గురించి మొత్తం చెప్పేశారు కార్తికేయ. 2010లోనే మొదటి సారి ఆమెను వరంగల్ నిట్లో చూశాను అని, ఆమె పేరు అని చెప్పుకొచ్చారు. నాటి నుంచి కొనసాగుతూ వచ్చిన ఈ స్నేహబంధం ఇప్పుడు పెళ్లిగా మారబోతోందని అన్నారు. నా ఫ్రెండ్ నా భాగస్వామిగా అయిందంటూ కార్తికేయ పేర్కొన్నారు. ఇలా తన లవ్ స్టోరీ గురించి ఒక్కసారిగా రివీల్ చేసేసరికి టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం అవాక్కవుతున్నారు. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి అయితే.. నో కామెంట్ అంటూ నోర్ముసుకున్న ఎమోజీని షేర్ చేశారు. అంతా మీరు చూపించే బాటే సార్ అంటూ కార్తికేయ రిప్లై కొట్టేశారు. ఇక అనసూయ, పాయల్ సైతం ఈ అనౌన్స్మెంట్పై స్పందించారు. చావు కబురు చల్లగా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన అనసూయకు కార్తికేయతో మంచి ర్యాపో ఏర్పడింది. తాజాగా అనసూయ స్పందిస్తూ.. కార్తికేయకు కంగ్రాట్స్ తెలిపారు. ఎంత బాగున్నారో అంటూ కంగ్రాట్స్ చెప్పడంతో.. థ్యాంక్స్ అని కార్తికేయ రిప్లై ఇచ్చేశారు. ఇక పాయల్ స్పందిస్తూ.. నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతోన్నాను. దేవుడు చేసిన జంట అంటూ కార్తికేయకు విషెస్ చెప్పారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gqRl7R
No comments:
Post a Comment