సీనియర్ హీరోయిన్ భర్త పోర్న్ రాకెట్ కేసు దేశవ్యాప్త సంచలనంగా మారింది. అశ్లీల చిత్రాలు షూట్ చేసి ఇంటర్నెట్లో పబ్లిష్ చేస్తున్నారనే ఆరోపణలతో రాజ్ కుంద్రా ఇష్యూ సెన్సేషన్ అయింది. ఇక ఈ కేసు విషయమై పోలీసుల విచారణలో రోజుకో విషయం బయటకు వస్తోంది. రాజ్ కుంద్రాతో పాటు ఆయన భార్య శిల్పా శెట్టి, అలాగే ఆయనతో సన్నిహితంగా ఉండే కొందరిపై విచారణ కొనసాగుతోంది. రాజ్ కుంద్రా ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పటినుంచి ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలపై కూపీ లాగుతున్నారు క్రైం బ్రాంచ్ అధికారులు. రాజా కుంద్రా బిజినెస్ వ్యవహారాలతో పాటు ఆస్తులపై లోతుగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాజ్ ఉండ్రపై ఉన్న వివిధ రకాల కేసులపై కూడా విచారణ నడుస్తోంది. అయితే తాజాగా ఓ కీలకమైన విచారణలో రాజ్ కుంద్రా దంపతులకు కాస్త ఊరట లభించింది. దీంతో శిల్పా శెట్టి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. పోర్న్ రాకెట్ కేసుతో పాటు పాత కేసులపై విచారణను మరింత ముమ్మరం చేయడంతో శిల్పా శెట్టి దంపతులపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే షేర్ హోల్డింగ్ వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణకు రాగా, దీనిపై సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ విషయంలో శిల్పాశెట్టి దంపతులు ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారణ అయ్యింది. నిర్దేశిత పరిమితులకు లోబడే షేర్ హోల్డింగ్ ఉన్నందున ఈ విషయంలో వారిపై చర్యలు అవసరం లేదనిసెబీ అభిప్రాయపడింది. 2015 సంవత్సరం మార్చి నెలలో 25.75 శాతం వాటా కొనుగోలుతో వియాన్ ఇండస్ట్రీస్ (గతంలో హిందుస్తాన్ సేఫ్టీ గ్లాస్ ఇండస్ట్రీస్)కి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ప్రమోటర్లుగా మారారు. అయితే సెబీ (సబ్స్టేన్షియల్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్ అండ్ టేకోవర్స్) రెగ్యులేషన్స్ లేదా SAST నిబంధనలను ఈ జంట ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ ముమ్మరం చేసిన సెబీ.. కుంద్రా దంపతుల వద్ద నిర్దేశిత పరిమితులకు లోబడే షేర్ హోల్డింగ్ ఉందని తెలిపింది. దీంతో శిల్ప శెట్టి దంపతులు ఊపిరి పీల్చుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rRHoEU
No comments:
Post a Comment