ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్పుత్కు ఎదురుదెబ్బ తగిలింది. మొన్న పెద్దపల్లిలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన హీరోయిన్పై కేసు నమోదు చేశారు. పాయల్ రాకతో పెద్దపల్లిలోని షాపింగ్ మాల్ ప్రాంగణంతో జనసందోహంతో నిండింది. పైగా ఆ ప్రారంభోత్సవం ఎక్కడా కూడా కరోనా నిబంధనలు పాటించలేదు. మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు. దీంతో పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ పెద్దపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. జూనియర్ సివిల్ ఇన్చార్జి జడ్జి పార్థసారథి సిఫార్సు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. మొత్తానికి ఇలా పాయల్ షాపింగ్ మాల్ నుంచి పిలుపు రావడంతో అలా వెళ్లారు.. చివరకు ఇలా కేసులో ఇరుక్కున్నారు. అసలే కరోనా పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. ఇలాంటి సమయంలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాలు అంటూ ఇలా సెలెబ్రిటీలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. మన దేశంలో కరోనా కేేసులు వచ్చిన మొదట్లో ఇలాంటి ఘటనలే ఎక్కువగా జరిగాయి. కరోనా హెచ్చరికలు ప్రభుత్వాలు చేసినా కూడా కొందరు మాత్రం వినలేదు. షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవం అంటూ జనాలంతా ఒకే చోటకు చేరేలా చేసేవారు. ఆ సమయంలో యాంకర్ రష్మీని కూడా ఇలానే ఆడుకున్నారు. ఓ వైపు ప్రజల ప్రాణాలు పోతూ ఉంటే.. మీకు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కావాలా? అంటూ రష్మీపై నెగెటివ్ కామెంట్లు చేశారు. ఆ సమయంలో రష్మి కూడా వాటిని గట్టిగానే తిప్పి కొట్టారు. ప్రభుత్వాలే అనుమతినిచ్చాయి.. వారు ప్రారంభం చేసుకుంటున్నారు.. దీంట్లో తాను చేయగలిగింది ఏమీ లేదని నాడు రష్మీ చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు పాయల్ ఏం చెబుతారో చూడాలి. అసలు ఈ విషయంపై పాయల్ స్పందిస్తారో లేదో. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఉండటమనేది తప్పేనని నెటిజన్లు పాయల్ మీద కౌంటర్లు వేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3D4EWQH
No comments:
Post a Comment