గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్యను అత్యంత దారుణంగా పట్టపగలు నడిరోడ్డుపై హత్యచేశాడు ప్రేమోన్మాది శశికృష్ణ. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రధాన రహదారిలో పరమయ్యగుంట సెంటరు దగ్గర ఘటన జరిగింది. నడి రోడ్డుపై జనం చూస్తుండగానే బీటెక్ విద్యార్థిని రమ్యను శశికృష్ణ అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. అయితే ఈ ఘటన జరిగే సమయంలో చుట్టూ జనం ఉన్నా.. అతన్ని అడ్డుకునే సాహసం చేయలేకపోయారు. కొంతమంది జనం ముందుకు వచ్చినా వాళ్లని కూడా కత్తితో బెదిరించి రమ్యని చంపేశాడు శశికృష్ణ. విచక్షణారహితంగా రమ్యపై దాడి చేయడంతో.. స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపే రమ్య మృతి చెందింది. ఈ హత్య ఘటనపై ప్రతిపక్ష టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసినప్పటికీ అతన్ని ఎన్ కౌంటర్ చేయాలంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో తెలుగు హీరోయిన్ రేఖ భోజ్ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టింది. ‘వాడ్ని కూడా అలానే ఎవరైనా నరికేస్తే.. ఆ నరికిన వాడితో పడుకుంటా.. ఐ యామ్ సారీ!! ఆ వీడియో చూసాక ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు😭.. అంత నిస్సహాయతలో వున్నాము మేము ఈ రోజు. జిల్లాకు ఒక సజ్జనార్ సార్ కావాలి. రమ్యా నీకు న్యాయం జరగాలి... Rest in peace Sister’’ అంటూ పోస్ట్ పెడుతూ.. ఊసరవెల్లి చిత్రంలో తమన్నా పోస్టర్ని షేర్ చేసింది . ఈ సినిమాలో కూడా తన ఫ్యామిలీని చంపిన వాళ్లపై పగసాధించడం కోసం ఎన్టీఆర్తో పడుకోవడానికి కూడా రెడీ అనే చెప్పే సందర్భంలో తమన్నా ఎమోషనల్గా ఈ డైలాగ్ చెప్తుంది. కాగా.. వైజాగ్కి చెందిన తెలుగు హీరోయిన్ రేఖా భోజ్ దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమహ: వంటి చిత్రాల్లో నటించింది. తెలుగు వాళ్లకి అవకాశం కల్పించాలని కోరుతూ పలు సందర్భాల్లో తన వాయిస్ వినిపిస్తుంటుంది ఈ హీరోయిన్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yU2yot
No comments:
Post a Comment