గాంధీని చంపిన గాడ్సేకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపుతూ అతన్ని నిజమైన దేశభక్తుడిగా అభివర్ణించిన నాగబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నిన్న (మే 19) పుట్టిన రోజు సందర్భంగా RIP నాధురాం గాడ్సే అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు . ‘ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కదా అనేది చర్చానీయాంశం. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తుచేసుకోవలనిపించింది. పాపం నాధురాం గాడ్సే... మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ పోస్ట్ పెట్టారు నాగబాబు. అయితే గాంధీని చంపిన గాడ్సేని నిజమైన దేశభక్తుడు అనడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరికొంతమంది నాగబాబుకి మద్దతు ప్రకటించారు. మొత్తానికి గాడ్సేపై నాగబాబు చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. దీనిపై సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుండగా.. తనను అర్థం చేసుకోవాలంటూ నాగబాబు మరో పోస్ట్ పెట్టారు. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు.నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను.నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం.ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం’ అంటూ గాడ్సే పోస్ట్పై దిద్దుబాటు చర్యలు చేపట్టారు నాగబాబు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ALrBB9
No comments:
Post a Comment