రాజమౌళి- మహేష్ బాబు కథపై క్లారిటీ.. మొదటిసారి ఆ జోనర్‌లో జక్కన్న!

టాలీవుడ్‌లో అపజయమంటూ ఎరగని దర్శకుడిగా పేరొందారు రాజమౌళి. ఏ సినిమా చేసినా అందులో ఓ ప్రత్యేకత చూపిస్తూ వస్తున్న ఆయన ఇటీవలే భారీ అనౌన్స్‌మెంట్ చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జక్కన్న.. ఓ మీడియాకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఇస్తూ తన తదుపరి మూవీ మహేష్ బాబుతో ఉండనుందని కన్ఫర్మ్ చేశారు. దీంతో ఒక్కసారిగా మహేష్ అభిమానునుల్లో ఉత్సాహం ఉరకలేసింది. ఇక ఈ మూవీ ఎలా ఉండనుంది? తమ హీరో కోసం ప్లాన్ ఏంటి? అనే దానిపై ఆరా దీయడం ప్రారంభించారు. మహేష్‌తో తాను చేయబోతున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తారని ముందే ప్రకటించారు రాజమౌళి. అదేవిధంగా ఎప్పటిలాగే ఈ సినిమాకు సంబంధించిన కథను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాస్తారని తెలిపారు. దీంతో అలా ప్రకటించగానే ఇలా ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా తాజాగా ఈ మూవీ కథాంశం, జోనర్ విషయమై ఆసక్తికర విషయం బయటకొచ్చింది. తండ్రి దగ్గర ఉన్న వాటిలోంచి ఓ స్టోరీ లైన్ ఎంపిక చేసిన జక్కన్న ఆ స్క్రిప్ట్ డెవలప్ చేయమని చెప్పారట. ప్రస్తుతం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అదే పనిలో నిమగ్నమై ఉన్నారని సమాచారం. అయితే ఈ స్టోరీ లైన్ గతంలో వచ్చిన రాజమౌళి సినిమాలకు భిన్నమైందని తెలుస్తోంది. ఇప్పటివరకూ తాను టచ్ చేయని థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా చేసేలా జక్కన్న ప్లాన్ చేశారట. కమర్షియల్ కథకు థ్రిల్లింగ్ అంశాలు జోడించి కథ రెడీ చేయాల్సిందిగా తండ్రిని కోరారట. ప్రస్తుతం ఆ పనులు చకచకా జరుగుతున్నాయని ఇన్‌సైడ్ టాక్. Also Read: ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి RRR మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాను లాక్‌డౌన్ ఫినిష్ కాగానే చకచకా పూర్తిచేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు పరశురామ్ కథ కోసం సిద్ధమవుతున్నారు . సో.. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే రాజమౌళి- మహేష్ కాంబో సెట్స్ మీదకు రానుందని స్పష్టమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eQ2RY3

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts