ఏం చేస్తున్నారు... కరోనా వైరస్‌పై రష్మీ వరుస ట్వీట్లు

జబర్దస్త్ బ్యూటీ ... సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అనేక సామాజిక అంశాలపై కూడా ఈ భామ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ‌పై కూడా రష్మీ ట్వీట్ చేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు) చేపడుతున్న కరోనా నియంత్రణ చర్యలపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. రష్మీ ఈ విషయంపై స్పందిస్తూ ఈ కరోనా వైరస్ స్కానింగ్ కేవలం ఇంటర్నేషనల్ ప్రయాణికులకేనా.. డోమెస్టిక్ ప్రయాణికులకు అవసరం లేదా.. ? అంటూ ఎయిర్ పోర్టు సిబ్బందిని ప్రశ్నించింది. దీనిపై ఎయిర్ పోర్టు సిబ్బంది స్పందించింది. APHO ద్వారా స్క్రీనింగ్ జరుగుతుందన్నారు. అందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని దేశీయ, విదేశీ టెర్మినల్స్ వద్ద కూడా పరిశుభ్రతకు సంబంధించి అవగాహన చర్యలు తీసుకున్నట్లుగా ఎయిర్ పోర్టు సిబ్బంది ట్వీట్ చేశారు. ఎయిర్ పోర్టు ఇచ్చిన సమాధానంతో రష్మీ గౌతమ్ మరో ట్వీట్ చేసింది. తన ట్వీట్‌కు తొందరగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపింది. అయితే సిబ్బంది తీసుకుంటున్న తగిన చర్యలు ఏంటో తెలపాలంటూ రష్మీ మరో ట్వీట్ చేసింది. తాను డొమస్టిక్ ఫ్లైట్స్ ద్వారా ముంబై నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్నానంది. ఎందుకంటే కరోనా వైరస్ ప్రభావం విపరీతంగా ఉందని రష్మీ తన ట్వీట్‌లో పేర్కొంది. మహారాష్ట్రలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. కరోనా వైరస్ సృష్టిస్తున్న సంక్షోభం మనందరికీ కొత్తది కాబట్టి అవగాహన కల్పించడంలో సాయం చేయాలని కోరింది. అంతర్రాష్ట్రాల మధ్య జరుగుతున్న ప్రయాణాల్ని మనం ఎలాగో ఆపలేం. కానీ ఎయిర్ పోర్టుల్లో సరైన ప్రొటొకాల్ పాటిస్తే మాత్రం ... సానుకూలంగా ఉన్న కేసుల సంఖ్యను పెరగకుండా అడ్డుకోవచ్చని రష్మీ అభిప్రాయపడింది. డొమస్టిక్ ఎయిర్ పోర్టు వద్ద కూడా టెంపరేజర్ స్క్రీనింగ్ ఎంతో అవసరమంది రష్మీ. రాత్రి తాను ఎయిర్ పోర్టులో కేవలం సీఐఎస్ఎఫ్ సిబ్బంది మాత్రమే మాస్క్ ధరించి ఉన్న విషయాన్ని గుర్తించినట్లుగా తెలిపింది రష్మీ గౌతమ్. హ్యాండ్ శానిటైజర్ గురించి అడిగినప్పుడు కూడా అక్కడున్న సిబ్బంది వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అయితే అందుకు తాను విమానాయన సంస్థల్ని,ఆ సిబ్బందిని నిందించడం లేదని పేర్కొంది రష్మీ. ఎందుకంటే తాను ఎవరిపై ఎలాంటి నిందలు వేయాలనుకోవడం లేదంది. రష్మీ చేస్తున్న వరుస ట్వీట్లతో ఎయిర్ పోర్టు సిబ్బంది కూడా మరో ట్వీట్ చేశారు. ఎయిర్ పోర్టులో కరోనా వైరస్‌ నేపథ్యంలో మెరుగైన చర్యలు తీసుకున్నామన్నారు. వాష్‌రూమ్ శుభ్రపరచడం, ఆటోమేటెడ్ శానిటైజర్‌లను ఉంచడం, ప్రయాణీకులందరిని టచ్‌పాయింట్ల వద్ద క్షుణ్ణంగా పరిశీలించడం, విమానాశ్రయ సిబ్బందికి ఫేస్ మాస్క్‌లు మరియు శానిటైజర్‌లను అందించడం వంటి అనేక పరిశుభ్రత చర్యలు పాటిస్తున్నామన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UkK1ir

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts