జేడీ చక్రవర్తి చాలా కాలం తర్వాత నటించిన సినిమా ‘MMOF’. ఈ సినిమా ట్రైలర్ను ఈరోజు లాంచ్ చేసారు. గెస్ట్గా వెళ్లారు. గతేడాది వచ్చిన ‘హిప్పీ’ సినిమాలో కీలక పాత్రలో నటించారు ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి. ఆయన సోలోగా నటించిన సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఎన్నో ఏళ్ల క్రితం MMOF అనే సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. థ్రిల్లర్, క్రైం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. దర్శకుడి పేరు యెన్ ఎస్ సీ. మొత్తానికి సినిమా షూటింగ్ పూర్తైంది. ఈరోజు ట్రైలర్ను లాంచ్ చేసారు. ట్రైలర్ లాంచ్కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పిలిపించారు జేడీ. వర్మ తీసిన ఎన్నో సినిమాల్లో జేడీ నటించారు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. అందుకే జేడీ పిలవగానే వర్మ కాదనకుండా అతిథిగా వచ్చారు. అయితే ట్రైలర్ చూసాక వర్మ వేసిన పంచ్లు మాత్రం హైలైట్గా నిలిచింది. ‘ఈ సినిమా ట్రైలర్ చూసాక నా మైండ్ స్లో అయిందా? లేదా ఈ సినిమా తీసినవారి మైండ్ ఫాస్ట్ అయిందా అని డౌట్ వచ్చింది. కన్ఫ్యూజన్లో పక్కనే ఉన్న ఉత్తేజ్ని అడిగా. అప్పుడు ఉత్తేజ్.. స్లోకి ఫాస్ట్కి మధ్యలో ఉన్నట్టుంది అన్నాడు. ఒక సినిమా కథ కొత్తగా ఉన్నప్పుడు అర్థం అవడానికి కాస్త సమయం పడుతుంది. నేను ఫస్ట్టైం ట్రైలర్ చూసినప్పుడు పక్కనే ఉన్న నేను సిరాశ్రీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. రెండోసారి చూసినప్పుడు నా కుడి వైపు ఉన్న ఉత్తేజ్ ముఖం చూసాను. అర్థమయ్యే ట్రైలర్స్ 99 శాతం ఉంటాయి. కానీ నా జీవితంలో అర్థంకాని ట్రైలర్ మొదటిసారి చూసాను' READ ALSO: 'పాజిటివ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్ చూసి చెప్పాలి. కొత్తగా ఆలోచించి తీసారు అనిపిస్తోంది. MMOF అనే టైటిలే అర్థంకాకుండా ఉంది. కాబట్టి దీని గురించి ఆలోచిస్తారు. డైరెక్టర్ పేరు యన్ ఎస్ సీ అని పెట్టారు. అంటే అతను చైనీస్ అనుకుంటాను. కరోనా వైరస్ రాకముందే అతను వచ్చి సినిమా తీసి వెళ్లిపోయి ఉంటాడని ఆశ. అతనితో కలిసి పనిచేసినవారంతా నా పక్కన ఉన్నారు. నాకు ధైర్యం ఎక్కువ కాబట్టి నేను అందరికీ షేక్ హ్యాండ్స్ ఇస్తున్నాను’ అన్నారు. వర్మ మాట్లాడుతున్నంత సేపు జేడీ చక్రవర్తితో పాటు అక్కడున్నవారంతా పగలబడి నవ్వుకున్నారు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aICZu3
No comments:
Post a Comment