జనతా కర్ఫ్యూ: లైవ్‌లో సందడి చేస్తోన్న 28 మంది టాలీవుడ్ స్టార్స్

కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ను పాటిస్తున్నారు. దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే, ఇళ్లలో ఖాళీగా కూర్చున్న తెలుగు సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా టాలీవుడ్ స్టార్స్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా పలకరిస్తున్నారు. వాళ్లతో ముచ్చటిస్తున్నారు. ‘మనందరి కోసం’ అనే స్లోగన్‌తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే ఈ లైవ్‌లు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మంచు లక్ష్మితో మొదలైన ఈ ఇన్‌స్టాగ్రామ్ లైవ్.. రాత్రి 8.30 గంటలకు రానా దగ్గుబాటితో ముగుస్తుంది. మొత్తం 28 మంది టాలీవుడ్ స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరిలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, మంచు మనోజ్, అల్లరి నరేష్, అనసూయ, సుధీర్ బాబు, కార్తికేయ వంటి స్టార్లు లైవ్‌లో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో ఈ లైవ్‌ను వీక్షించొచ్చు. స్టార్లను మీరు ప్రశ్నలు అడగవచ్చు. అయితే, మొత్తం 28 మంది సెలబ్రిటీల్లో 26 మంది పేర్లు మాత్రమే వెల్లడించారు. మిగిలిన ఇద్దరు సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎవరు ఏ సమయంలో లైవ్ ఇస్తున్నారో మంచు లక్ష్మి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో వరుసగా పాల్గొనే స్టార్లు వీరే.. 1. లక్ష్మి మంచు, 2. నవదీప్, 3. కాజల్ అగర్వాల్, 4. ఈషా రెబ్బా, 5. రాజ్ తరుణ్, 6. రకుల్ ప్రీత్ సింగ్, 7. మంచు మనోజ్, 8. రాహుల్ రామకృష్ణ, 9. ప్రగ్యా జైశ్వాల్, 10. అల్లరి నరేష్, 11. సత్యదేవ్, 12. అనసూయ, 13. సందీప్ కిషన్, 14. అదిత్, 15. తేజస్వి, 16. ప్రణీత, 17. నిహారిక కొణిదెల, 18. సుశాంత్, 19. విశ్వక్‌సేన్, 20. నిఖిల్ సిద్ధార్థ, 21. షీరత్ కపూర్, 22. రాహుల్ రవీంద్రన్, 23. సుధీర్ బాబు, 24. కార్తికేయ, 25. శ్రియా శరణ్, 26. రానా దగ్గుబాటి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2J8spkm

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts