వెనక్కి తగ్గిన రవితేజ, నితిన్.. బరిలో ధరమ్ తేజ్, బాలయ్య

పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్లు విడుదల చేశాక ఎందుకొచ్చిన గొడవ అనుకుని మళ్లీ వెనక్కి తగ్గుతున్నాయి. ముందు ప్రకటించిన డేట్లలో కాకుండా మరో హీరో సినిమాతో క్లాష్ అవకుండా జాగ్రత్తపడుతున్నాయి. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘డిస్కోరాజా’ సినిమాతో పాటు నితిన్ నటిస్తున్న ‘భీష్మ’ సినిమాల విడుదల వాయిదా పడ్డాయి. బాబీ సింహా డిస్కో రాజా సినిమకు దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను 2020 జనవరి 24న విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోపక్క వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ‘భీష్మ’ సినిమాను క్రిస్మస్‌కు విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అదే రోజున బాలకృష్ణ, శర్వానంద్, సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమాలు విడుదల కాబోతున్నాయి. అసలే సరైన హిట్స్ లేక సతమతమవుతున్న నితిన్ కెరీర్‌కు మళ్లీ రిస్క్ ఎందుకని భావించి మరో హీరోతో క్లాష్ లేకుండా చూసుకుని కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రవర్గాలు తెలిపాయి. ఇక మిగిలింది నందమూరి హీరో బాలకృష్ణ, మెగా హీరో సాయి ధరమ్ తేజ్, యువ హీరో శర్వానంద్. వీరు ముగ్గుర్లో వయసు పరంగా స్టార్‌డం పరంగా చూసుకుంటే బాలయ్యే. ఆయన సినిమాలు విడుదలయ్యే రోజున మరో సినిమా విడుదలైతే రిస్కే. ఎందుకంటే బాలయ్యకు ఉన్న క్రేజ్ వేరు. కాబట్టి ఆయన సినిమాలు సోలోగానే రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈసారి అలా కాదనిపిస్తోంది. ఎందుకంటే బాలయ్య నటిస్తున్న ‘రూలర్’ సినిమాను క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో పాటు ధరమ్ తేజ్ నటించిన ‘ప్రతిరోజూ పండగే’, శర్వానంద్ నటించిన ‘జాను’ సినిమాలు బరిలో ఉన్నాయి. బాలయ్య సినిమాలు ఇప్పటివరకు వాయిదా పడినట్లు రికార్డులో లేదు. కావాలంటే ఆయనతో ఎందుకు అనుకుని ఇతర హీరోలే వెనక్కి తగ్గారు తప్ప బాలయ్య ఎప్పుడూ తన సినిమాలు వాయిదా వేసుకోలేదు. ఒకవేళ వాయిదా పడినా నెలల తేడాతో కాకుండా వారాల తేడాతోనే విడుదల చేసేవారు. మరి ఇప్పుడు ‘రూలర్’తో పెట్టుకుంటే ‘ప్రతిరోజూ పండగే’ జరుపుకోవడం కష్టమని భావించి ధరమ్ తేజ్ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇకపోతే శర్వానంద్, సమంత నటించిన ‘జాను’ సినిమా కూడా రిస్క్ చేసి మరీ క్రిస్మస్‌కు విడుదల కాబోతోంది. మిగతా రెండు సినిమాలు ఒరిజినల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినవే. కానీ ‘జాను’ మాత్రం తమిళంలో విడుదలైన ‘96’కు రీమేక్‌గా రాబోతోంది. ఒకవేళ 96 సినిమాను సబ్‌టైటిల్స్‌తో చూసేసిన వారు ఎక్కువుంటే మాత్రం శర్వా, సమంత సినిమాకు ఎక్కువ జనాలు వచ్చే ఆస్కారం ఉండదు. పోనీ శర్వా, సామ్ కాంబినేషన్‌లో వస్తు్న్న తొలి సినిమా కాబట్టి జనాలు సినిమా చూసేందుకు ఆసక్తి చూపినా.. మరో రెండు పెద్ద సినిమాలతో పాటు విడుదల చేస్తే మాత్రం బాక్సాఫీస్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంది. మరో సినిమాతో పోటీ ఎందుకని వాయిదా వేసుకుంటూ ముందుకెళ్లిపోతున్నారు కానీ ఏ ఒక్కరూ దీపావళి పండుగను పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కరి గురి 2020లో వచ్చే సంక్రాంతిపైనే గుర్తుంది కానీ.. దీపావళి గురించి మర్చిపోయినట్లున్నారు. ఆ రోజు ఏ ఒక్క తెలుగు సినిమా విడుదల కావడంలేదు. దాంతో పలు తమిళ సినిమాలు ఆరోజున తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలైన మార్కెట్ చేసుకోవాలని అనుకుంటున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VRQBwZ

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts