సెట్లో పవన్ కళ్యాణ్ తీరు.. ఆ విషయం చెప్పగానే షాకయ్యారు! నిత్యామీనన్ కామెంట్స్ వైరల్

పవర్ స్టార్ సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చాక దూసుకుపోతున్నారు. 'వకీల్ సాబ్' రూపంలో భారీ సక్సెస్ అందుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ''. పవన్ కళ్యాణ్- దగ్గుబాటి రానా కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ సుందరి సంయుక్త మీనన్ తెలుగు తెరకి పరిచయం కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన నిత్యామీనన్.. భీమ్లా నాయక్ సినీ విశేషాలు చెబుతూ పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్‌‌తో కలిసి పని చేయడం చాలా సౌకర్యంగా అనిపించిందని చెప్పారు. సెట్లో పవన్ కళ్యాణ్ చాలా తక్కువగా మాట్లాడతారని, ఎలాంటి సీన్‌ అయినా ఠక్కున చేసి చూపిస్తారని అన్నారు. ‘భీమ్లా నాయక్‌’ కోసం ఓ లేడీ పవన్‌ కళ్యాణ్‌ని తీసుకుంటున్నామని, మీ ఇద్దరికీ సరిగ్గా సరిపోతుందని పవన్‌తో అన్నట్లు త్రివిక్రమ్‌ సర్‌ తకకు ఫోన్ చేసి మరీ చెప్పారని తెలిపారు నిత్య. ఈ మూవీలో తన రోల్ షూటింగ్ ఇంకా పూర్తికాలేదని, ఇంకా ఓ పాట షూట్ చేయాల్సి ఉందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఇకపోతే భీమ్లా నాయక్ షూటింగ్‌ చేస్తుండగా ఖాళీ సమయంలో అప్పుడప్పుడు పవన్‌ కళ్యాణ్ సర్‌తో మాట్లాడేదాన్నని చెప్పిన నిత్యామీనన్.. తాను నిర్మాతగా మారి ‘స్కైలాబ్‌’ చేస్తున్నట్లు చెప్పానని, అప్పుడాయన ఆశ్చర్యపోయారని అన్నారు. ప్రత్యేకంగా తనను పవన్ అభినందించడం మరచిపోలేనని తెలిపారు. నిత్యామీనన్ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ‘స్కైలాబ్‌’ సినిమా విషయానికొస్తే.. ఈ మూవీలో సత్యదేవ్‌, రాహుల్‌ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వైద్యభరితమైన కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ఈ సినిమా ట్రైలర్ ద్వారా అర్థమైంది. డిసెంబర్‌ 4న ఈ మూవీ రిలీజ్ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32uSHdy

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts