‘జాంబీ రెడ్డి’ తేజకు మెగాస్టార్ సపోర్ట్ ఉంది.. నాకంటే సీరియర్ వీడు: వరుణ్ తేజ్

బాల నటుడిగా.. ఇంద్ర సినిమాలో జూనియర్ ఇంద్రసేనా రెడ్డిగా తొడకొట్టిన హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘’ ఫిబ్రవరి 5 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు మెగా ప్రిన్స్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నవాడైనా సరే.. మైక్ పట్టుకుని జనం ముందు ఎలా మాట్లాడాలో తేజాని చూసి నేర్చుకోవచ్చు. కవిత్వం రాశాడు.. డైలాగ్‌లు రాస్తున్నాడు.. కరోనా వల్ల ఇలాంటి ఫంక్షన్లు మిస్ అయ్యాం. ఈ జనం ఈలలు, గోలలు, సినిమా సందడి చూస్తుంటే జోష్ వస్తుంది. ఈ సినిమా టీజర్ నుంచి ప్రమోషన్స్ అన్నీ జనంలోకి బాగా వెళ్లాయి.. చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ‘జాంబీ రెడ్డి’ అనే టైటిల్ బాగుంది. ఇది బాగా ఎక్కేసింది. జాంబీ అనేది చాలా ఫేమస్.. హాలీవుడ్‌లో కూడా చాలా సినిమాలు చేస్తున్నారు. ఇది చాలా సక్సెస్ ఫుల్ జానర్. ఇండియాకి వచ్చేసరికి హిందీలో ఒకటి.. తమిళ్‌లో ఒకటి వచ్చాయి. ఫస్ట్ టైం టాలీవుడ్‌లో బాంబీ మూవీ వస్తోంది. ప్రశాంత్ గట్స్‌కి హాట్సాఫ్. అతని వర్క్ట్ స్టైల్ అ!, కల్కి సినిమాల్లో చూశాను. అతను చాలా టాలెంటెండ్. ఇద్దరం కలిసి చాలాసారు సినిమాల గురించి డిస్కషన్స్ జరిగాయి. కమర్షియల్, చిల్ సినిమాలు కాకుండా ఇలాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ మంచి విజన్‌తో చేస్తున్నాడు. ఇలాంటి దర్శకుడు ఇండస్ట్రీకి అవసరం. నేను హీరోగా ఎక్స్ పీరియన్స్ ఐదేళ్లే. కానీ ఈ సినిమా హీరో తేజ గాడికి 20 ఏళ్ల ఎక్స్ పీరియన్స్. మాకన్నా సీనియర్ వాడు. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. మా ఫ్యామిలీ మెంబర్‌లా ఉండేవాడు.. ఇంద్ర సినిమా అప్పుడు. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేశాను. కానీ ఓబేబీ సినిమా ట్రైలర్‌లో తేజాని చూశాక.. చిన్నగా క్యూట్‌గా ఉండేవాడు.. హ్యాండ్సమ్ బాయ్‌లా అయ్యాడనిపించింది. నేనైతే ఫస్ట్ సినిమా నుంచి ఏదైనా డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని అనుకుంటున్నా. కానీ తేజా అయితే ఫస్ట్ సినిమాతోనే ఆ టాస్క్ పూర్తి చేశాడు. రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో తొలి అడుగువేసి.. హిట్ కొట్టి ఇండస్ట్రీలో పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నా. చిరంజీవి గారికి తేజా అంటే చాలా ఇష్టం. ఆయన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. ఈ సినిమాకి పనిచేసిన టీం కూడా బాగా సెట్ అయ్యింది. ఇండస్ట్రీలో నా అంత పొడుగు నిర్మాత ఎవరున్నారా అనుకున్నా.. ఈ చిత్రం నిర్మాత దుబాయ్ నుంచి వచ్చారట.. వెల్కమ్ టు టాలీవుడ్. లాక్ డౌన్ తరువాత ఇప్పుడిప్పుడే సినిమాలు పుంజుకుంటున్నాయి. రిలీజ్ అయిన సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. జనం థియేటర్స్‌కి వచ్చి ఆదరిస్తున్నారు. వీళ్లు ఆదరణ చూస్తుంటే మాకు మరింత ఉత్సాహం వస్తుంది. ఫిబ్రవరి 5న విడుదలౌతున్న జాంబీ రెడ్డి చిత్రాన్ని చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నా’ అంటూ స్పీచ్ ఇచ్చి ఆకట్టుకున్నారు వరుణ్ తేజ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36zZFNu

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts