Sridevi Death Anniversary: అమ్మను తలుచుకుంటూ జాన్వి పోస్ట్..

‘అతిలోకసుందరి’ అనంతలోకాల్లో కలిసిపోయి నేటికి రెండేళ్లు అవుతోంది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పటికీ శ్రీదేవి ఇక లేరన్న నిజాన్ని ఆమె కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. భర్త బోనీ కపూర్ శ్రీదేవిని తలుచుకుంటూ ఏడవని రోజంటూ లేదనే చెప్పాలి. ఈరోజు సందర్భంగా ఆమె పెద్ద కూతురు జాన్వి కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తన చిన్నప్పుడు తల్లితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘రోజూ నిన్ను మిస్ అవుతూనే ఉంటాను’ అని పేర్కొ్న్నారు. ఈ పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. జాన్వి ధైర్యంగా ఉండాలని, ఇంట్లోవారికి ఆమె ధైర్యం చెప్పాలంటూ సర్దిచెప్తున్నారు. అభిమానులు కూడా శ్రీదేవిని తలుచుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఆమె ఏ లోకంలో ఉన్నా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. 2018 ఫిబ్రవరి 24న తన మేనల్లుడు పెళ్లి కోసం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడి జుమైరా ఎమిరేట్స్ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయారు. అప్పటికి జాన్వి ‘ధడక్’ సినిమాలో నటిస్తున్నారు. జాన్వికి అది తొలి సినిమా. కూతురి సినిమాను చూడకుండానే వెళ్లిపోవడం బాధాకరం. అప్పటినుంచి తండ్రిని, చెల్లి ఖుషిని జాన్వినే చూసుకుంటున్నారు. ఇటీవల సింగపూర్‌లో శ్రీదేవి మైనపు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. READ ALSO: గతేడాది శ్రీదేవి వర్థంతి రోజున బోనీ కపూర్ కుటుంబం ఘనంగా సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీదేవికి ఎంతో ఇష్టమైన చీరను వేలం వేసి వచ్చిన డబ్బును సేవా కార్యక్రమానికి ఉపయోగించాలని ఆమె కుటుంబం నిర్ణయించింది. శ్రీదేవికి ఎంతో ఇష్టమైన ‘కోటా’ చీరను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టారు. ‘పరిసెర’ అనే లగ్జరీ ఆన్‌లైన్ షాప్‌లో ఈ చీరపై బిడ్‌లను ఆహ్వానిస్తున్నారు. ప్రారంభ బిడ్ ధరను రూ.40 వేలుగా నిర్ణయించారు. వేలంలో వచ్చిన డబ్బును ‘కన్సెర్న్ ఇండియా ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందజేసారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3a0iLfe

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts