ఆకలన్నా కూడా టాలీవుడ్ పట్టించుకోదు: స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఒకప్పుడు అన్ని చిత్ర పరిశ్రమల్లో హీరోకే ప్రాధాన్యత ఇచ్చేవారు. తిండి దగ్గర్నుంచి మర్యాదల వరకు ముందు హీరో తిన్న తర్వాతే మిగతావారికి పెట్టేవారు. ఇలాంటి పరిస్థితి ప్రముఖ బాలీవుడ్ నటి నేహా ధుపియాకు ఎదురైంది. ఆమె తెలుగులో ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘పరమ వీర చక్ర’ సినిమాల్లో నటించారు. అయితే ఓసారి షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు చేదు అనుభవం ఎదురైందట. ఆకలిగా ఉందని డైరెక్టర్‌కు చెబితే ముందు హీరో తిన్నాకే మిగతావారు తినాలని చెప్పారట. READ ALSO: ‘‘దక్షిణాది పరిశ్రమలో నేను సెక్సిజం ఎదుర్కొన్నాను. ఓ తెలుగు సినిమా షూటింగ్ సమయంలో నాకు ఆకలిగా ఉందని తిన్నాక షూటింగ్ చేద్దామని డైరెక్టర్‌కు చెబితే ముందు హీరో తిన్నాకే మిగతావారు తినాలని అన్నారు. నాకు ఆకలేస్తోందని చెప్తే హీరో షాట్ రెడీగా ఉందని, అందుకే ముందు ఆయన తినేస్తే మంచిదని అన్నారు. అది నాకు చాలా జోక్‌గా అనిపించింది. సరే అని నేను వెళ్లి ఓ పక్కకు కూర్చున్నాను. అయితే నేను ఆ విషయం గురించి అంతగా పట్టించుకోలేదు. అప్పట్లో ఇలాంటి అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ జరిగేవి కానీ ఇప్పుడు ఇలాంటివేమీ జరగలేదు. ఇక హిందీ చిత్ర పరిశ్రమలో మాత్రం నన్ను సినిమాల్లోకి తీసుకున్నట్లే తీసుకుని తొలగించేసేవారు. నేను ఓ సినిమాకు సంతకం చేసి దానిపై వర్క్ చేస్తున్నప్పుడు మరుసటి రోజు పేపర్లో నేను ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చేసేవి. అలా చాలా సార్లు జరిగాయి. ఆ తర్వాత నేను ఈ జాబ్‌పై బాగా ఫోకస్ చేయడంతో ఇప్పుడు అలాంటి పరిస్థితులు నాకు ఎదురవడంలేదు’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MXDXcP

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts