బాలీవుడ్లో కరోనా కలకలం రేపుతోంది. ఇండస్ట్రీకి చెందిన పలువురిపై కరోనా పంజా విసిరింది. ఇటీవల కాలంలో బాలీవుడ్కి చెందిన పలువురు ప్రముఖులు కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనీల్ సూరి మరణించారు. అనీల్ సోదరుడు , నిర్మాత రాజీవ్ సూరీ మాట్లాడుతూ.. అనీల్ జూన్ 2 నుండి హై ఫీవర్తో బాధపడుతున్నారని తెలిపారు. ఆ తర్వాత రోజు నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందన్నారు. దీంతో అనీల్ సూరిని వెంటనే లీలావతి, హిందూజా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. అయితే ఆస్పత్రి సిబ్బంది సైతం ఆయనను అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించారని ని అనీల్ సోదరుడు తెలిపారు. దీంతో ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అనీల్ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం కన్నుమూశారు. శుక్రవారం ఉదయం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో అనీల్ అంత్యక్రియలు నిర్వహించారు. అనీల్కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనీల్ .. రాజ్కుమార్, రేఖ కాంబినేషన్లో 'కర్మయోగి', 'రాజ్ తిలక్' వంటి చిత్రాలు నిర్మించారు. ఆయన సోదరుగు రాజీవ్ సూరి .. 1979లో అమితాబ్, మౌసమి ఛటర్జీ జంటగా బసు ఛటర్జీ దర్శకత్వంలో 'మంజిల్' చిత్రం నిర్మించారు. 'నా అభిమాన దర్శకుడు, మా సోదరుడు ఒకే రోజు కన్నుమూయడం నిజంగా దురదృష్టకరం' అన్నారు రాజీవ్ సూరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30cObND
No comments:
Post a Comment