ప్రస్తుతం వెండితెరపై బయోపిక్స్ హవా ఎక్కువగా కనిపిస్తోంది. గొప్ప వ్యక్తులు, ఫేమస్ సెలబ్రిటీలు, రాజకీయ వేత్తల జీవిత చరిత్రలపై ప్రేక్షకలోకం ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే మహానటి సావిత్రి జీవితకథకు నీరాజనం పట్టారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే మరో లెజెండరీ నాయకురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత రూపొందిస్తున్నారు. '' పేరుతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్లో లీడ్ రోల్ పోషించింది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ 'తలైవి' చిత్రం కోసం కంగన చాలా శ్రమించిందని సమాచారం. ఈ సినిమాలో ఇతర రాజకీయ నాయకులకు జయలలిత ఇచ్చిన కౌంటర్స్ యధావిధిగా ఉండేలా ప్లాన్ చేశారని, అదేవిధంగా ఆమెకు ఎదురైన చేదు అనుభవాలను సైతం స్క్రీన్ ప్లేలో యాడ్ చేశారనే వార్తలు షికారు చేశాయి. జయలలిత జీవితంలో ఎత్తుపల్లాలు, వివాదాలు అన్నీ కళ్ళకు కట్టినట్లు ఇందులో చూపించనున్నారని తెలిసింది. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. జయలలిత జీవితం, అందునా కంగనా లాంటి నటీమణి లీడ్ రోల్లో నటించడం కారణంగా ఈ చిత్రానికి భారీ డిమాండ్ నెలకొంది. Also Read: దీంతో కేవలం ఓటీటీ హక్కుల ద్వారా 55 కోట్ల రూపాయలు రాబట్టింది 'తలైవా' యూనిట్. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కలసి ఈ హక్కులను తీసుకున్నాయని స్వయంగా కంగనా పేర్కొంది. అయితే ఈ మూవీని ఓటీటీ వేదికలతో పాటుగా థియేటర్స్ లోనూ విడుదల చేయాలని చూస్తున్నట్లు కంగనా తెలపడం విశేషం. ఏదేమైనా జయలలిత బయోపిక్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న జనం కోసం జూన్ 26న ఈ మూవీని విడుదల చేస్తున్నారు మేకర్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MBrxXn
No comments:
Post a Comment