బాలీవుడ్ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్తో మొదలైన చేదు వార్తలు ఇండస్ట్రీని వదలడం లేదు. ఇర్ఫాన్ ఖాన్ తర్వాత ప్రముఖ నటుడు రిషి కపూర్ చనిపోయారు. ఆ తర్వాతా తాజాగా మ్యూజిక్ డైరెక్ట్ వాజిద్ ఖాన్ కరోనా బారిన పడి కన్నుమూశారు. ఇప్పుడు తాజాగా చోటుచేసుకుంది. యువ క్యాస్టింగ్ డైరెక్టర్ 28 ఏళ్ల చెందాడు. మెదడులో రక్తస్రావంతో గత నెల 31న ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు. అయితే క్రిష్ కపూర్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్ని ఆయన మేనమామ సునీల్ భల్లా ఖండించారు. క్రిష్ కపూర్ బ్రెయిన్ హేమరేజ్తో బాధపడుతున్నట్లు తెలిపారు. సబర్బన్ మీరా రోడ్డులోని తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడన్నారు. దీంతో వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని బుధవారం తెలిపారు. క్రిష్ కపూర్ తల్లి, భార్య, ఏడేళ్ల పాపతో కలిసి జీవిస్తున్నాడు. క్రిష్ అకాల మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మహేష్ భట్ నిర్మాతగా వ్యవహరించిన ‘జలేబీ’, కృతి ఖర్బందా నటించిన ‘వీరే కి వెడ్డింగ్’ వంటి సినిమాలకు క్రిష్ కాస్టింగ్ డైరెక్టర్గా పనిచేశారు. మరోవైపు, సీనియర్ పాటల రచయిత అన్వర్ సాగర్ (70) నిన్న మధ్యాహ్నం మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతుండడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. వాజిద్ ఖాన్ మృతి వార్ద నుంచి కోలుకోక ముందే క్రిష్ మరణ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3705yCO
No comments:
Post a Comment