ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్: రాధే శ్యామ్ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్

కరోనా కారణంగా వాయిదాపడ్డ పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా లైన్ లోకి వచ్చేస్తున్నాయి. వరుసపెట్టి పెద్ద సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్స్ చూస్తున్నాం. ఇప్పటికే భీమ్లా నాయక్, RRR, ఆచార్య రిలీజ్ డేట్స్ అధికారికంగా ప్రకటించగా తాజాగా రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా వాయిదాపడ్డ ఈ సినిమాను మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పీరియాడిక్ ల‌వ్ స్టోరీలో వెండితెరపై ప్రభాస్- పూజా జోడీని చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సంక్రాంతి కానుకగా గ్రాండ్‌‌గా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్.. మరోసారి కరోనా విజృభించడంతో వెనక్కి తగ్గారు. దీంతో రాధే శ్యామ్ రిలీజ్‌పై బోలెడన్ని రూమర్స్ బయటకొచ్చాయి. ఈ సినిమాకు ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని, అతిత్వరలో రాధే శ్యామ్ ఓటీటీలో రిలీజ్‌ కాబోతుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇట్టి వార్తలను ఖండిస్తూ ఈ సినిమా థియేట‌ర్స్‌లోనే విడుద‌ల‌వుతుందంటూ క్లారిటీ ఇచ్చేసిన డైరెక్ట‌ర్ రాధా కృష్ణ‌కుమార్, తాజాగా రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తూ ప్రభాస్ అభిమానులను హూషారెత్తించారు. ఈ మేరకు మార్చి 11వ తేదీని ఫిక్స్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/fwFDaxOzR

No comments:

Post a Comment