ఎన్టీఆర్ ఈవెంట్ కోసం 10 ప్రత్యేక రైళ్లు.. ఆశ్చ‌ర్యపోయిన ఆలియా భ‌ట్‌!

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉండే హీరోల్లో యంగ్ టైగ‌ర్ ఒక‌రు. ఈయ‌న రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో హీరోగా న‌టించిన చిత్రం RRR. జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా ఒమిక్రాన్ వైరస్ కారణంగా తప్పని పరిస్థితుల్లో వాయిదా పడింది. సినిమా రిలీజ్‌కి వారం రోజులు కూడా లేనప్పుడు.. ఎంటైర్ యూనిట్ ప్ర‌మోష‌న్స్‌ను పూర్తి చేసేసి విడుద‌ల‌కు రెడీగా ఉన్న‌ప్పుడు RRR వాయిదా ప‌డ‌టం అంద‌రినీ నిరుత్సాహానికి గురి చేసింది. కానీ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను ముంబైలో చిత్ర యూనిట్ నిర్వ‌హిస్తున్న‌ప్పుడు ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చోటు చేసుకుంది. బాలీవుడ్‌లో క‌పిల్ శ‌ర్మ షోకు మంచి ఆద‌ర‌ణ ఉంటుంది. స‌ద‌రు షోలో RRR యూనిట్ నుంచి ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, ఆలియా భ‌ట్ హాజ‌ర‌య్యారు. వీరి మ‌ధ్య సంభాష‌ణ సాగుతున్న‌ప్పుడు ఓ విష‌యం చోటు చేసుకుంది. హోస్ట్ క‌పిల్ శ‌ర్మ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడుతూ ‘మీరు హీరోగా నటించిన ఓ సినిమాకు 10 ప్రత్యేకమైన రైళ్లలో అభిమానులు వచ్చారట కదా.. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది’ దాని గురించి కాస్త చెబుతారా? అని ప్ర‌శ్నించ‌గా.. ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘నా జీవితంలో నేను మరచిపోలేని ఘటన. ‘ఆంధ్రావాలా’ సినిమా ఫంక్ష‌న్ కోసం 9-10 ల‌క్ష‌ల మంది ఫ్యాన్స్ వ‌చ్చారు. అంత మంది వ‌చ్చిన‌ప్ప‌టికి కూడా, ఒక్క‌రికి కూడా ఏమీ కాలేదు’’ అంటూ ఎన్టీఆర్ చెప్పారు. ఆంధ్రావాలా ఈవెంట్‌కి ప‌ది ల‌క్ష‌ల మంది ఫ్యాన్స్ వ‌చ్చార‌న‌గానే, ఆలియా భ‌ట్ వాట్‌.. అంటూ ఆశ్చ‌ర్య‌పోయింది. ప‌ది వేల మంది ఉంటార‌ని అనుకున్నాను. అంతా మంది వ‌చ్చారా? అని నోరెళ్ల బెట్టింది. ఈ చిత్రాన్ని పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేశారు. భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన స‌ద‌రు చిత్రం ఆశించిన స్థాయి విజ‌యాన్ని ద‌క్కించుకోలేదు. ప్ర‌స్తుతం తార‌క్, రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం RRR. 1920 బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ మూవీ. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం కావ‌డంతో అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zkVxy4

No comments:

Post a Comment