సోష‌ల్ మీడియాలో ఆ ఫొటోల‌ను పోస్ట్ చేసిన హీరోయిన్‌.. అరెస్ట్ చేసిన పోలీసులు, బెయిల్‌పై విడుద‌ల‌

మల‌యాళ హీరోయిన్ నిమిషా స‌జ‌య‌న్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకో తెలుసా! చెప్పులేసుకుని ఫొటోలు దిగినందుకు. అదేంటి.. చెప్పులేసుకుని ఫొటోలు దిగితే త‌ప్పా.. అందుకు అరెస్ట్ చేసేస్తారా? అనే సందేహం రాక‌మాన‌దు. అస‌లేం జ‌రిగింది అనే వివ‌రాల్లోకెళ్తే.. రీసెంట్‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన చిత్రాలు న‌య‌ట్టు, మాలిక్ వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించిన హీరోయిన్ నిమిషా స‌జ‌య‌న్, ఈమె రీసెంట్‌గా త‌న స్నేహితుల‌తో క‌లిసి అర‌మ్మల‌లోని ప‌ల్లియోదం అనే ప‌డ‌వ‌ను చూడ‌టానికి వెళ్లింది. అక్క‌డున్న ఉత్స‌వ ప‌డ‌వ‌ల్లో స్నేహితుడితో క‌లిసి ఆమె ఫొటోలు కూడా తీసుకుంది. దాన్ని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసింది. అదే ఆమెకు స‌మ‌స్య‌ను తెచ్చి పెట్టింది. అదేంటంటే, పంపా నదిలోకి దేవుడిని ఊరేగించ‌డానికి అర‌మ్మల ఆల‌యంలో ప‌ల్లియోదం ప‌డ‌వ‌ల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఉత్స‌వ ప‌డ‌వ‌ల్లోకి చెప్పులేసుకుని వెళ్ల‌కూడ‌దు. కానీ నిమిషా తెలియ‌కుండా చెప్పుల‌తో ఉత్స‌వ ప‌డవ‌ల్లోకి వెళ్ల‌డంతో హిందూ సంఘాలు నిమిషాపై పెద్ద ఎత్తున మండిప‌డ్డాయి. పోలీసుల‌కు కంప్లైంట్ కూడా వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు నిమిషాను, ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశారు. త‌ర్వాత ఆమెకు బెయిల్ కూడా వ‌చ్చింద‌నుకోండి. అదే వేరే సంగ‌తి. త‌న ఫొటోల‌పై వివాదం రాగానే నిమిషా త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మాల నుంచి స‌ద‌రు ఫొటోల‌ను తొల‌గించింది. పోలీసులు నిమిషా, ఆమె స్నేహితుడి స్టేట్‌మెంట్ తీసుకుని బెయిల్‌పై విడుద‌ల చేశారు. కానీ ఆమెకు, కుటుంబ స‌భ్యుల‌కు బెదిరింపులు రావ‌డం మొద‌ల‌య్యాయి. దీంతో తాను కావాల‌నే అలా చేయ‌లేద‌ని, తెలియ‌క చేశాన‌ని ఆమె వివ‌ర‌ణ ఇచ్చుకుంది. అయినా కూడా నిమిషాకు బెదిరింపులు రావ‌డం మొద‌ల‌య్యాయి. దాంతో ఆమె ప్రెస్ మీట్ పెట్టి త‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. అంతే కాదండోయ్ త‌న‌ను బెదిరించిన వారిపై పోలీస్ కేసు కూడా పెట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Vzxaxc

No comments:

Post a Comment