‘ఎంఎస్ ధోనీ’, ‘చిచోరే’ తదితర సినిమాలతో యావత్ భారతదేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు హీరో . అయితే అనూహ్యంగా గత ఏడాది జూన్లో ముంబైలోని తన ఇంట్లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మృతితో యావత్ సినీ ప్రపంచం మూగబోయింది. అయితే ఈ కేసులో పలు పుకార్లు, అనుమానాల మధ్య ముంబయి పోలీసు విభాగం ఈ హఠాన్మరణాన్ని దర్యాప్తు చేయడం ప్రారంభించింది. అయితే సుశాంత్ మృతి తర్వాత ఇండస్ట్రీలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సుశాంత్ గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి పాత్ర ఉందని భావించిన పోలీసు అధికారులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టిన నాక్రోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రియాతో పాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకుంది. కేసులో రియా పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆమెను నెలరోజుల జైలు శిక్ష విధించారు. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్న హేమల్ షా అనే వ్యక్తిని ఎన్సీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ‘సుశాంత్ సింగ్ మృతి కేసుపై విచారణ జరుపుతున్న సమయంలో డ్రగ్స్ వ్యవహారంలో హేమల్ షా అనే వ్యక్తి పాత్ర ఉన్నట్లు మాకు తెలిసింది. దీంతో అతన్ని యాంటీ-డగ్ర్ ఏజెన్సీ అధికారులు ఓ పథకం ప్రకారం అదుపులోకి తీసుకున్నారు’ అని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. గోవాలో హేమల్ షాని అదుపులోకి తీసుకన్న అధికారులు.. కోర్టులో ప్రవేశపెట్టారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nXj56B
No comments:
Post a Comment