గత కొన్ని రోజులుగా హీరో నిత్యం వార్తల్లో నిలుస్తూ జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఓ వర్గానికి టార్గెట్ అవుతున్నారు. తన ఫోన్ నెంబర్ లీక్ చేశారని.. తన కుటుంబ సభ్యులను చంపేస్తామని, అత్యాచారం చేస్తామంటూ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ నాయకులే ఈ పని చేశారంటూ వరుసపెట్టి బీజీపీ నేతలపై సిద్దార్థ్ చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ యువ పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్యపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదానికి తెరలేపారు సిద్దార్థ్. 'యంగ్ ఎంపీ తేజస్వి సూర్య చాలా ప్రమాదకరమైన వ్యక్తి. టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ కంటే దశాబ్దకాలపు ముందు వ్యక్తి. ఈ ట్వీట్ను సేవ్ చేయండి' అంటూ ట్వీట్ చేసి రచ్చ చేశారు. దీంతో సిద్ధార్థ్పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సిద్దార్థ్ సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణు ఆరోపించడంతో ఈ వివాదం పెద్దదైంది. విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై సిద్దార్థ్ మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 'సిగ్గుండాలి' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో షాకింగ్ పోస్ట్ పెట్టారు. ''నా టీడీఎస్ చెల్లించడానికి ఆయన రెడీగా లేడు. నేను అసలైన భారతీయుడిని, ట్యాక్స్ పేయర్ కదరా విష్ణు. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట. సిగ్గుండాలి'' అంటూ సిద్దార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజా పరిస్థితులు చూస్తుంటే ఈ వివాదం ఎంతవరకు పోతోందనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eYdKI4
No comments:
Post a Comment