అనసూయకు 25 లక్షలు యాంకర్ అనసూయ లీడ్ రోల్ పోషించిన 'థాంక్యూ బ్రదర్' సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. అయితే కేవలం 17 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్లో పాల్గొన్న అనసూయ ఒక్క రోజుకు 1.5 లక్షల రూపాయలు తీసుకుందట. మొత్తంగా 25 లక్షలు ఆమె తీసుకుందని టాక్. ఒక్కరు కాదు ఇద్దరు.. బాలకృష్ణ రొమాన్స్ నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందించబోతున్న కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారట. ఆ ఇద్దరిలో ఒకరిగా ఇప్పటికే రాయ్ లక్ష్మీని కన్ఫర్మ్ చేశారని టాక్. నమిత టాకీస్ రాను రాను ఓటీటీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రవివర్మ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్తో కలిసి నమిత కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభిస్తోంది. 'నమిత టాకీస్' అనే పేరుతో ఈ ఓటీటీ నడుస్తుందని అధికారికంగా వెల్లడించారు. చిన్న నిర్మాతలు, కొత్త దర్శకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ ఓటీటీ స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పారు నమిత. వెంకీతో చర్చలు షురూ ప్రస్తుతం 'దృశ్యం 2' మలయాళ రీమేక్ చేస్తున్న విక్టరీ వెంకటేష్ తాజాగా మరో రీమేక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో వచ్చిన 'డ్రైవింగ్ లైసెన్స్' మూవీ రీమేక్ కోసం వెంకటేష్తో చర్చలు నడుస్తున్నాయట. సోనూసూద్పై మాధవన్ ప్రశంసలు కరోనా కష్టకాలంలో సాయం చేస్తూ ఆపదలో ఉన్న వారికి చేయూతనందిస్తున్న సోనూసూద్పై మాధవన్ ప్రశంసలు గుప్పించారు. ఎంతో మందికి సోను స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారని అన్నారు. సోనూపై ఆ దేవుడి దయ ఎప్పుడూ ఉండాలని కోరుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b6XBPl
No comments:
Post a Comment