జోరుమీదున్న వైష్ణవ్ తేజ్.. ఉప్పెన స్టార్‌కి మరో క్రేజీ ఆఫర్! ఈ సారి ప్లాన్ ఇలా..

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆయన మొదటి సినిమా 'ఉప్పెన' భారీ సక్సెస్ అందుకోవడంతో టాలీవుడ్ క్రేజీ హీరో అయ్యాడు వైష్ణవ్. బుచ్చిబాబు సానా రూపొందించిన ఈ సినిమాలో వైష్ణవ్ నటన చూసి ప్రేక్షకలోకం ఫిదా కాగా, ఆయన నటనపై పలువురు దర్శకనిర్మాతలు ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఆయనకు వరుస ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. 'ఉప్పెన' చేస్తూనే క్రిష్ దర్శకత్వంలో తన రెండో మూవీ ఫినిష్ చేసిన వైష్ణవ్ తేజ్.. రీసెంట్‌గా మూడో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అర్జున్ రెడ్డి కథను తమిళ్‌లో రీమేక్ చేసిన గిరీశయ్య దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన ‘రొమాంటిక్‌’ ఫేమ్‌ కేతికా శర్మ హీరోయిన్‌గా నటించనుంది. ఈ క్రమంలోనే తాజాగా వైష్ణవ్‌కి మరో క్రేజీ ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. ఉప్పెన లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మైత్రి మూవీ మేకర్స్ వారితో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని వైష్ణవ్ తేజ్ భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఆ ఛాన్స్ ఇప్పుడు దక్కిందని అంటున్నారు. ''ఛలో, భీష్మ'' వంటి కమర్షియల్ సక్సెస్‌లను తెరకెక్కించిన ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని టాక్. వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రస్తుతం ఈ సినిమా కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్‌మెంట్ రానుందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33dXFbW

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts