అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘’. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ను తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో కొద్దిరోజులు చేశారు. అయితే యూనిట్లో కొందరికి కరోనా సోకడంతో షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఎంతో ప్రయాసపడి లొకేషన్కి వెళ్లిన తర్వాత అనుకోని అవాంతరాలు ఎదురుకావడంతో తన ప్లాన్ మార్చేశాడట. షూటింగ్ కోసం తాము అడవుల్లోకి వెళ్లడం కాదు... అడవినే హైదరాబాద్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. అదెలా సాధ్యం అనుకుంటున్నారా.. హైదరాబాద్ శివార్లలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ‘పుష్ప’ షూటింగ్ కోసం సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చేవారం నుంచి అక్కడ చిత్రీకరణ మొదలవుతుందట. ఎన్ని అవాంతరాలు ఎదురైనా షూటింగ్ నిరాటంకంగా జరిగేలా ఆ వ్యవసాయ క్షేత్రంలో శేషాచలం అడవులను తలపించేలా భారీ సెట్ వేస్తున్నారట. ఆ ప్రాంతాన్ని భారీ చెట్టు, పొదలతో దట్టమైన అడవిలా మార్చేసేందుకు ఆర్ట్స్ డిపార్ట్మెంట్ కష్టపడుతోందట. సెట్స్ విషయంలో సుకుమార్ ఎంత శ్రద్ధ తీసుకుంటారో అందరికీ తెలిసిందే. ‘రంగస్థలం’ చూసిన వారెవరూ ఆ గ్రామం సెట్ అని అనుకోరు. ఇప్పుడు అలాంటి మ్యాజిక్ ‘పుష్ప’తో మరోసారి చేయనున్నాడట ఈ డైరెక్టర్. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34dyGX2
No comments:
Post a Comment